కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం ఉదయం తెలంగాణ సచివాలయంలోని 5వ అంతస్తు తన చాంబర్లో మంత్రి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం తెలంగాణ రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన కొన్ని ముఖ్య ఫైల్స్పై సంతకాలు చేయనున్నారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 119 స్థానాలకు గాను 64 స్థానాల్లో హస్తం పార్టీ జెండా ఎగిరింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేయగా కొంతమంది మంత్రులుగా ప్రమాణం చేశారు. వారిలో కోమటి రెడ్డి వెంకట రెడ్డి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కీలక నేతల్లో కోమటి రెడ్డి ఒకరు. గతంలో మంత్రిగా పని చేసిన ఆయన తాజాగా మరోసారి మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
Roads
నెల్లూరు జిల్లాలో చిరు జల్లులకే రోడ్డు చిత్తడిగా మారుతున్నాయి. అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లతో ప్రజలు పలు ఇబ్బందులు పడుతున్నారు. కావలి పట్టణం ఇందిరమ్మ కాలనీలో స్కూలు ఆటోకు ప్రమాదం తప్పింది. విద్యార్థులను ఎక్కించుకుని వెళుతున్న ఆటో గుంతలో పడి బోల్తా కొట్టబోయింది. అయితే ప్రమాదం నుంచి విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. తేలికపాటి వర్షాలకే రోడ్లపై గుంతల్లో పెద్ద ఎత్తున నీరు చేరింది. ఆటో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరగ పోవడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాలు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గుంతలమయం అయిన రోడ్లు గురించి డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా జగన్ ప్రభుత్వం వైఫల్యాన్ని ప్రజలకి తెలిసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి వినుత కోటా ఆధ్వర్యంలో జనసేన – టీడీపీ నాయకులు శ్రీకాళహస్తి పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీ, దక్షణ కైలాసగిరి కాలనీ, తొట్టంబేడు మండలం కొత్త కండ్రిగ గ్రామాల్లో పర్యటించి గుంతలమయం అయిన రోడ్డులో పడవలు వదిలి నిరసన వ్యక్తం చేశారు. గుంతల రోడ్ల చిత్రాలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 4.5 సం.|| తట్టెడు మట్టి వెయ్యలేని ముఖ్యమంత్రి 3 రాజధానులు కడుతాడా, కొత్త రోడ్లు వెయ్యలేదు, కనీసం గుంతలకి మట్టి కూడా వెయ్యలేని దయనీయ పరిస్థితిలో రాష్ట్రం ఉంది. గుంతలమయం అయిన రోడ్డు లో ప్రజల ప్రయాణం తీవ్ర ఇబ్బందిగా వాహన దారులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. 5 నెలల్లో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని రోడ్లు బాగు చేసి, అవసరం అయిన దగ్గర కొత్త రోడ్లు వేస్తామని ప్రజలకి హామీ ఇచ్చారు.
శ్రీకాకుళం జిల్లా… ఇచ్ఛాపురం… నియోజకవర్గంలో రోడ్ల దుస్థితిపై టిడిపి జనసేన ఉమ్మడి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అద్వానంగా ఉన్న రాజపురం- కమలాయిపుట్టుగ రహదారి వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్ల దుస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ మీడియాతో మాట్లాడారు. టిడిపి ప్రభుత్వ హాయంలో ఇచ్చాపురం నియోజకవర్గంలో సుమారు 85 కోట్ల రూపాయలతో రహదారుల నిర్మాణం చేశామని, వైసిపి ప్రభుత్వం రహదారుల దుస్థితిని గాలికి వదిలేసిందని అన్నారు. తమ ఉమ్మడి నిరసన కార్యక్రమాలను డిజిటల్ క్యాంపైనింగ్ ద్వారా మరింత విస్తృతంగా, ఉధృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. అధ్వానంగా ఉన్న రహదారులను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదని జనసేన నాయకులు దాసరి రాజు అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన నేతలు పాల్గొన్నారు…




Total views : 80397