శ్రీ సత్య సాయి జిల్లా చిలమత్తూరు మండలం కొడికొండ చెక్ పోస్ట్ వద్ద భారీ స్థాయిలో గంజాయి పట్టుబడింది. పోలీసుల తనిఖీల్లో భాగంగా పెద్ద మొత్తంలో కంటైనర్ ద్వారా అనంతపురం వైపు నుండి జాతీయ రహదారిపై బెంగళూరుకు వెళ్తున్న కంటైనర్ వాహనాన్ని పోలీసులు ముందస్తు సమాచారంతో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో పెద్ద మొత్తంలో కంటైనర్ లో బెంగళూరుకు తరలిస్తున్న గంజాయి స్వాధీనం చేసుకొన్నారు. ముగ్గురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు కోడికొండ చెక్ పోస్ట్ మీదుగా బెంగళూరు వెళ్తున్న కంటైనర్ ని ఆపి చెక్ చేయగా గంజాయి బయటపడింది. గంజాయి తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతోనే పోలీసుల దాడులు గంజాయి విలువ భారీ మొత్తంలో ఉన్నట్లు సమాచారం.
Tag:
Sri satya sai
శ్రీ సత్య సాయి జిల్లా ఓబుల దేవర చెరువు మండల కేంద్రంలో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన వెలుగు చూసింది. స్థానిక బీసీ కాలనీలో నివాసముంటున్న మెహ్రూన్ బి 8 సంవత్సరాల క్రితం భర్తతో విభేదాలు రావడంతో ఒంటరిగా నివాసముంటూ కూలి పనులు చేస్తూ జీవనం సాగించేది. ఈ క్రమంలో ఇంటి స్టోర్ రూమ్ ఆవరణలో అచేతనంగా పడి ఉన్న మహిళను చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. భార్యకు దూరంగా ఉంటున్న భర్త వలి ఉపాధి పని నిమిత్తం బెంగళూరులో ఉంటున్నాడు. ఆమె మృతికి గల కారణాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.






Total views : 79657