బీఆర్ఎస్ను ఓడించే దమ్ము ఎవరికీ లేదని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం బాగ్అంబర్పేట డివిజన్లోని గజానంద్గడ్డ, పాములబస్తీ, పోచమ్మబస్తీ, కుర్మబస్తీలో బీఆర్ఎస్ అంబర్పేట అభ్యర్థి, కాలేరు వెంకటేష్, కార్పొరేటర్ బి.పద్మావెంకటరెడ్డితో కలిసి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పాదయాత్ర చేసిన మంత్రి తలసాని, ఎమ్మెల్యే కాలేరు వెంకటే్షలకు మహిళలు శాలువాకప్పి స్వాగతం పలికారు. కార్యక్రమంలో నియోజకవర్గం బీఆర్ఎస్ పరిశీలకులు గండ్ర మోహన్రెడ్డి, బీఆర్ఎస్ అధ్యక్షుడు సీ.హెచ్.చంద్రమోహన్, నాయకులు శ్రీపతిరెడ్డి, పద్మావతి పాల్గొన్నారు.
Srinivas Yadav
పేదలు గొప్పగా ఉండాలనేది తమ లక్ష్యమని సనత్ నగర్ అసెంబ్లీ బిఆర్ఎస్ అభ్యర్థి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పద్మారావు నగర్, నాగదేవత టెంపుల్, ఈశ్వరమ్మ బస్తీ, హమాలీ బస్తీ, చిదానందం కాలనీ తదితర ప్రాంతాలలో పాదయాత్ర గా ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటి వద్ద మంత్రిని శాలువాలు కప్పి, పూలమాలలు వేసి, మంగళ హారతులు పట్టి ఘన స్వాగతం పట్టారు. ప్రచారంలో అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలికారు. ఈశ్వరమ్మ బస్తీ, పద్మారావు నగర్ ఏరియా బస్తీల్లో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించామని, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మళ్ళీ వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే కనుక మిగిలిన సమస్యలను కూడా పరిష్కరిస్తామని వెల్లడించారు. నిరుపేదలు అత్యధికంగా నివసించే హమాలీ బస్తీలో అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం ఎన్నికలు పూర్తయిన తర్వాత చేపట్టి తీరుతామని స్పష్టం చేశారు.





Total views : 80024