తెలంగాణ అసెంబ్లీలో అధికార, విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ సాగింది. అధికార, విపక్షాల నడుమ వాగ్యుద్ధం జరిగింది. నువ్వెంతా అంటే నువ్వెంతా అనుకున్నారు. తాము చేసిన అభివృద్ధిని సోదాహరణంగా వివరిస్తూనే కాంగ్రెస్ పార్టీని నిశితంగా బీఆర్ఎస్ విమర్శించింది. గత సర్కారు తప్పులను ఎత్తి చూపుతూనే తామేంటో చాటుకున్నారు మంత్రులు. ఏం చేయబోతున్నమో వివరించారు. కేసీఆర్ హయాంనాటి అవకతవకలను తవ్వి తీస్తామని హెచ్చరించారు.
Telangana Assembly Elections
తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపు. మల్లు భట్టి విక్రమార్కకు ఆర్థిక శాఖ, ఇంధన శాఖ కేటాయింపు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సమాచార శాఖ, రెవెన్యూ, గృహ నిర్మాణం. దామోదర్ రాజనర్సింహకు ఆరోగ్యశాఖ. సీతక్కకు పంచాయతీరాజ్ శాఖ. ఉత్తమ్ కుమార్ కు సివిల్ సప్లై , ఇరిగేషన్ శాఖ కేటాయింపు. జూపల్లి కృష్ణారావుకు ఎక్సైజ్ శాఖ , పర్యాటక శాఖ. దుదిల్ల శ్రీధర్ బాబుకు ఐటీ , పరిశ్రమల శాఖ, శాసనసభ వ్యవహారాల శాఖ. తుమ్మల నాగేశ్వరరావు కు వ్యవసాయ శాఖ, చేనేత, టెక్స్ టైల్స్. కొండ సురేఖకు అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ. కోమటిరెడ్డికి ఆర్ అండ్ బి శాఖ, సినిమా టోగ్రఫీ.
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో 8 స్థానాల్లో పోటీ చేసిన పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన దారుణ ఓటమి పాలైంది. బీజేపీతో కలిసి బరిలోకి దిగిన జనసేన తొలుత 11 స్థానాల్లో పోటీ చేయాలని భావించింది. చివరికి 8 స్థానాలకు పరిమితమై కూకట్పల్లి, తాండూరు, కోదాడ, నాగర్కర్నూలు, ఖమ్మం, కొత్తగూడెం, వైరా , అశ్వారావుపే స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. వీరికోసం పార్టీ అధ్యక్షుడు పవన్ ప్రచారం చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూకట్పల్లిలో ప్రచారం చేశారు. అయినప్పటికీ అందరూ ఓటమి పాలయ్యారు. అంతేకాదు, ఏ ఒక్కరూ డిపాజిట్ దక్కించుకోలేకపోయారు.
కూకట్పల్లి నుంచి పోటీచేసిన ముమ్మారెడ్డి ప్రేమ్కుమార్ ఒక్కరే 39,830 ఓట్లు సంపాదించుకోగలిగారు. మిగతా వారందరూ 5 వేల లోపు ఓట్లకు పరిమితమయ్యారు. తాండూరులో జనసేన అభ్యర్థికి 4,087 ఓట్లు పోలవగా, కోదాడలో 2,151, నాగర్కర్నూలులో 1,955, ఖమ్మం 3,053, వైరా 2,712, వైరా 2,712, కొత్తగూడెం1,945, అశ్వారావుపేట అభ్యర్థికి 2,281 ఓట్లు పోలయ్యాయి.
ఈ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన సీపీఎం పోటీ చేసిన 19 స్థానాల్లోనూ డిపాజిట్ కోల్పోయింది. అంతేకాదు, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి వంటి కీలక నేతలు కూడా డిపాజిట్ కోల్పోయారు. సీపీఎం తొలుత కాంగ్రెస్తో కలిసి పోటీ చేయాలని నిర్ణయించినా పొత్తు చర్చలు ఫలించకపోవడంతో ఒంటరిగా బరిలోకి దిగి ఓటమి పాలైంది.
సికింద్రాబాద్ నియోజకవర్గంలో రెండవ రౌండ్ పూర్తయ్యేవరకు BRS అభ్యర్థి పద్మారావు గౌడ్ ఆధిక్యంలో ఉన్నారు. BRS అభ్యర్థి పద్మారావు గౌడ్ కు రెండవ రౌండ్ లో బీఆర్ఎస్ 5228 ఓట్లు, బీజేపీ అభ్యర్థి మేకల సారంగపాణి కి 1399 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్ధి ఆదం సంతోష్ కు 2615 ఓట్లు వచ్చాయి. ఇప్పటి వరకు BRS అభ్యర్థి పద్మారావు 6544 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కౌంటింగ్ కు సర్వం సిద్ధం
12 అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ కు ఐదు ప్రాంతాల్లో ఏర్పాట్లు
1- వరంగల్ ఎనుమాముల మార్కెట్ లో 5 నియోజకవర్గాల లెక్కింపు -వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, నర్సంపేట, పరకాల
వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు కోసం 23 టేబుల్స్ ఏర్పాటు.
14 టేబుల్ లలో ఈవీఎం ఓట్ల లెక్కింపు జరగనుండగా, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కోసం 9 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 24 రౌండ్ లలో లెక్కింపు పూర్తవుతుంది.
పరకాల, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట, నర్సంపేట నియోజకవర్గాల ఓట్లు లెక్కింపు కోసం ఒక్కొక్క నియోజకవర్గానికి 17 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 14 టేబుల్స్ లో ఈవీఎం ఓట్ల లెక్కింపు జరగనుండగా మూడు టేబుల్స్ లో పోస్టల్ బ్యాలెట్ ల లెక్కింపు జరగనుంది.
2- ములుగు కలెక్టర్ కార్యాలయం అవరణలో ములుగు నియోజకవర్గ ఓట్ల లెక్కింపు.
మొత్తం 17 టేబుల్స్ ఏర్పాటు చేయగా 14 టేబుల్స్ లో ఈవీఎం ఓట్ల లెక్కింపు మూడు టేబుల్స్ లో పోస్టల్ ఓట్ల లెక్కింపు జరుగనుంది. 22 రౌండ్ల తర్వాత తుది ఫలితం వస్తుంది.
3- భూపాలపల్లి అంబేద్కర్ స్టేడియం పక్కన ఉన్న సింగరేణి మినీ ఫంక్షన్ హాల్లో భూపాలపల్లి నియోజకవర్గం ఓట్ల లెక్కింపు.
మొత్తం 17 టేబుల్స్ ఏర్పాటు చేయగా 14 టేబుల్స్ లో ఈవీఎం ఓట్ల లెక్కింపు మూడు టేబుల్స్ లో పోస్టల్ ఓట్ల లెక్కింపు జరగనుంది. 23 రౌండ్ల లో లెక్కింపు పూర్తవుతుంది.
4- జనగామ పెంబర్తి వీబిఐటి ఇంజనీరింగ్ కాలేజ్ లో మూడు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు
(జనగామ, స్టేషన్గన్పూర్, పాలకుర్తి)
ఒక్కొక్క నియోజకవర్గానికి 17 టేబుల్ ఏర్పాటు. 14 టేబుల్స్ లో ఈవీఎం ఓట్ల లెక్కింపు, మూడు టేబుల్స్ లో పోస్టల్ ఓట్ల లెక్కింపు జరగనుంది. 18 రౌండ్లలో లెక్కింపు పూర్తి కానుంది.
5- మహబూబాద్ టౌన్ లోని సాంఘిక సంక్షేమ గురుకుల భవనంలో మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు.
ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఓటరు తీర్పు మరికొద్ది గంటల్లో వెలువడనున్నది. పటిష్ట బందోబస్తు నడుమ ఓట్ల లెక్కింపునకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఉదయం 5 గంటలకే అధికారులు లెక్కింపు కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభంకానున్నది. నగరంలో తొలి ఫలితం చార్మినార్ నియోజకవర్గం నుంచి వచ్చే అవకాశం ఉండగా, చివరి ఫలితం శేరిలింగంపల్లి నియోజకవర్గంలో వెల్లడికావచ్చు. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 14 లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేయగా, యూసుఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మిగిలిన 13 నియోజకవర్గాలకు విడిగా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
భద్రాది కొత్తగూడెం జిల్లా, ఉదయం 7.00 నుండి అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పాల్వంచా లోని అనుబోసే ఇంజినీరింగ్ కళాశాలో ఏర్పాటు చేశారు.
1)పినపాక నియోజకవర్గం 110 :-
మొత్తం ఓట్లు: 1,98,402
పోలైన ఓట్లు: 1,58,978
పోలింగ్ శాతం :80.13%
పోలింగ్ బూత్ ల సంఖ్య : 244
కౌంటింగ్ రౌండ్లు :18
2)ఇల్లందు నియోజకవర్గం 111:-
మొత్తం ఓట్లు: 2,19,569
పోలైన ఓట్లు: 1,76,840
పోలింగ్ బూత్ ల సంఖ్య : 241
పోలింగ్ శాతం :80.54%
కౌంటింగ్ రౌండ్లు:18
3)కొత్తగూడెం నియోజకవర్గం 117:-
మొత్తం ఓట్లు: 2,43,846
పోలైన ఓట్లు: 1,86,347
పోలింగ్ బూత్ ల సంఖ్య : 253
పోలింగ్ శాతం : 76.42%
కౌంటింగ్ రౌండ్లు:19
4)అశ్వారావుపేట నియోజకవర్గం 118:-
మొత్తం ఓట్లు: 1,55,961
పోలైన ఓట్లు: 1,35,501
పోలింగ్ బూత్ ల సంఖ్య : 184
పోలింగ్ శాతం :86.88%
కౌంటింగ్ రౌండ్లు: 14
5)భద్రాచలం నియోజకవర్గం119:-
మొత్తం ఓట్లు: 1,48,661
పోలైన ఓట్లు:1,17,447
పోలింగ్ బూత్ ల సంఖ్య : 176
పోలింగ్ శాతం :79%
కౌంటింగ్ రౌండ్లు: 13
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా మొత్తం
పోలింగ్ బూత్ ల సంఖ్య : 1,098
జిల్లా లో పోలింగ్ ప్రదేశాలు : 701
జిల్లా లో సమస్యాత్మక కేంద్రాలు :320
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ఓటర్లు:-
మొత్తం ఓట్ల సంఖ్య : 9,66,439.
మొత్తం పోలైన ఓట్లు :7,75,113.
మొత్తం పోలైన ఓట్ల శాతం :80.20%
మొత్తం కౌంటింగ్ రౌండ్లు: 82.
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కొరకు
బ్యాలెట్ యూనిట్లు:2435
కంట్రోల్ యూనిట్లు :1790
వివిప్యాడ్లు :1777
ఎన్నికల్లో వినియోగించారు..
నేడే ఉత్క్కంటకు తెర, నేడు ప్రజా తీర్పు తెలనున్న అభ్యర్థుల భవితవ్యం.
నాలుగు జిల్లాలో పది నియోజకవర్గాలు లెక్కింపు. ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు. 289 పోలింగ్ కేంద్రాలు, 21రౌండ్లు…….!
హాజీపూర్ మండలం ముల్కల్లలోని ఐజా ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించనున్న అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజక వర్గాల ఓట్లు అదే కళాశాల భవనంలో లెక్కిస్తారు. కౌంటింగ్ కేంద్రంలో భద్రపర్చిన స్ట్రాంగ్ రూమ్ గదుల తలుపులకు ట్రిపుల్ లాక్ సిస్టం ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు ప్రాంతంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు 144 సెక్షన్ విదించారు.
నల్లగొండ జిల్లా లో 6 నియోజక వర్గాలు..
నల్గొండ జిల్లాలో పోలింగ్ 85.49% నమోదు. నల్లగొండ, నకిరేకల్,మునుగోడు, దేవరకొండ,నాగార్జున సాగర్, మిర్యాలగూడ. నల్గొండ జిల్లా కేంద్రంలోని మిర్యాలగూడ రోడ్డు దుప్పలపల్లి గోదాంలో ఈవీఎంలను భద్రపరిచారు అక్కడే కౌంటింగ్ ఉంటుంది.
సూర్యాపేట జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు :- 84.83 % పోలింగ్ జరిగింది సూర్యాపేట, హుజుర్నగర్, కోదాడ, తుంగతుర్తి సూర్యాపేట జిల్లా లోని నాలుగు నియోజకవర్గాల EVM లు సూర్యాపేటలోని వ్యవసాయ మార్కెట్ లో స్ట్రాంగ్ రూం లో బద్రపరిచారు.. ఎన్నికల సిబ్బంది అక్కడే కౌంటింగ్ నిర్వహిస్తారు.
యాదాద్రి జిల్లాలో రెండు నియోజకవర్గాలు :- భువనగిరి, ఆలేరు
యాదాద్రి భువనగిరి జిల్లాలో 90.03% పోలింగ్ నమోదు. భువనగిరి లోని ఆరోరా ఇంజనీరింగ్ కాలేజ్ లో ఈవీఎంలను భద్రపరిచారు అక్కడే కౌంటింగ్ జరుగుతుంది.
తెలంగాణలో ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి కాచిగూడ వీరసావర్కర్ విగ్రహం వరకు రెండు కిలో మీటర్ల మేర సాగిన బీజేపీ రోడ్డు షోలో ప్రధాని పాల్గొన్నారు. ప్రజలకు, పార్టీ నేతలు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. మోదీపై అభిమానులు పూలవర్షం కురిపించారు. ఈ రోడ్డు షోలో మోదీ వెంట కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ ఉన్నారు. రోడ్డు షో కాచిగూడ చౌరస్తాకు చేరుకున్న తర్వాత వీరసావర్కర్ విగ్రహానికి మోదీ పూలమాల వేశారు. ప్రధాని రోడ్డు షో నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రతా చర్యల్లో భాగంగా చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు. రోడ్డు షోతో తెలంగాణ బీజేపీలో ఊపు వచ్చిందని నేతలు భావిస్తున్నారు.





Total views : 147600