తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ పాలకమండలి సమావేశం నిర్వహించారు. పాలకమండలి సమావేశంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి 2024-25 వార్షిక బడ్జెట్ ను బోర్డులో ప్రవేశపెట్టారు. శ్రీవారి ఆలయ వార్షిక బడ్జెట్ 5వేల కోట్ల ను దాటేసింది. 15సంవత్సరాల క్రితం వేయి కోట్లు ఉన్న బడ్జెట్ ఇప్పుడు 5వేల కోట్లు దాటడం రోజురోజుకు స్వామివారికి వచ్చే ఆదాయాన్ని సూచిస్తుంది. గత కరోనా సమయంలో ఆదాయం తగ్గినప్పటికీ గత రెండు సంవత్సరాలుగా పూర్తిస్థాయిలో పెరగడంతో ఈ మార్కును దాటిందని ఛైర్మన్ తెలిపారు.
TTD chairman
తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవాలయ ఆధునీకరణ పనులను వేగవంతం చేయాలని టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేనివిధంగా చర్యలు చేపట్టాలన్నారు. తొలుత గంగమ్మ తల్లిని భూమన కరుణాకర రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ కట్టా గోపి యాదవ్, ఈవో మమత స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేపట్టారు. అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ శిరీష, నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, దొడ్డారెడ్డి శంకర్ రెడ్డి, దొడ్డారెడ్డి ముని శేఖర్ రెడ్డి, తొండమనాటి వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు.
Read Also..
తిరుమలకు ప్రతి రోజు ప్రపంచం నలుమూలల నుండి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు టీటీడీ అత్యున్నత ప్రమాణాలతో అన్నప్రసాదాలు అందిస్తున్నట్లు ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.తిరుమలలో మంగళవారం ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగా భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తున్న ఆలయాల్లో టీటీడీ ప్రథమ స్థానంలో నిలుస్తోందన్నారు. ఇటీవల తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవంలో బియ్యం సరిగా ఉడకలేదని కొందరు భక్తులు ఆందోళన చేసినట్లు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. దాదాపు 700 మంది ఉన్నహాల్లో కేవలం 15 మంది మాత్రమే భోజనం చేస్తున్న మిగిలిన భక్తులను రెచ్చ కోట్టేవిధంగా మాట్లాడటం పలు అనుమానాలు కలిగిస్తోందన్నారు.ఇప్పటి వరకు టీటీడీపై చిన్న ఫిర్యాదు కూడా లేకుండా నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందిస్తున్నట్లు చెప్పారు. సాదారణంగా ఒక్కొక్కరి ఆహారపు అలవాట్లు ఒక్కో విధంగా ఉంటుందన్నారు. స్వామివారి దగ్గర ప్రతి ఒక్కరు సంయమనంతో ఉండాలన్నారు. అన్నప్రసాదంలో ఏదైన పొరపాట్లు జరిగి ఉంటే సరిదిద్దుకుంటామని ఛైర్మన్ వివరించారు.
శ్రీవారి అనుగ్రహంతో గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తిరుమలలోని ఐదు ప్రధాన జలాశయాలు పూర్తిగా నిండాయని, దాదాపు ఏడాదికి సరిపడా తాగు నీళ్లు ఉన్నట్లు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. మైచాంగ్ తుఫాను కారణంగా గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తిరుమలలో నిండిన జలాశయాలను మంగళవారం ఛైర్మన్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా ఛైర్మన్ మాట్లాడుతూ, 15 రోజుల క్రితం తిరుమల, తిరుపతిలలో నీటి కొరత ఎక్కువగా ఉన్నదని, దీనిని అధిగమించడానికి కండలేరు రిజర్వాయర్ నుండి నీటిని పంపింగ్ చేయాలని నిర్ణయించామన్నారు. నవంబరు 23వ తేదీ శ్రీవారి పాదాల చెంత అలిపిరిలోని సప్తగోప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్రారంభించినట్లు తెలిపారు. ఆ రోజు నుండే స్వామివారి అనుగ్రహంతో తిరుమల, తిరుపతిలలో ప్రారంభమైన వర్షాలు, గత రెండు రోజుల్లో 24 సెంటి మీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. టీటీడీ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి డ్యాంల నుండి నీటిని విడుదల చేస్తారన్నారు. ఇందులో భాగంగా ఇవాళ తెల్లవారుఝామున గోగర్భం, పాప వినాశనం, ఆకాశగంగ డ్యామ్ గేట్లను అధికారులు తెరచి నీటిని బయటకు వదిలినట్లు వివరించారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో మహాద్వారం ద్వారా ఆయన ఆలయంలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా ప్రధానికి టీటీడీ ఛైర్మన్, ఈవో, అర్చకులు స్వాగతం పలికారు. ఆలయంలోకి ప్రవేశించిన ప్రధాని ధ్వజ స్తంభానికి మొక్కారు. అనంతరం మూలవిరాట్టును దర్శించుకున్నారు. ఆ తర్వాత హుండీలో కానుకలను సమర్పించారు. అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం పలికారు. శేషవస్త్రాన్ని అందజేశారు. అనంతరం టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈఓ ధర్మారెడ్డి స్వామివారి చిత్ర పటం, డైరీ, క్యాలండర్ లను అందించారు. ప్రధాని మోదీ ఆలయంలోనే దాదాపు 50 నిమిషాలు గడిపారు.
Read Also..
Read Also..
తిరుపతి అభివృద్దే మా ఆశయంగా ముందుకు సాగుతామని, ప్రజాభివృద్ది విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని టీటీడీ చైర్మెన్, తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి స్పష్టం చేసారు. తిరుపతి నగరంలోని తిలక్ రోడ్డు నుండి జబ్బార్ లే అవుట్ జంక్షన్ మీదుగా నూతనంగ నిర్మించిన భూపిరాట్టి రహదారిని ఆదివారం టీటీడీ చైర్మెన్, ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవగా, శ్రీశ్రీశ్రీ పెద్ద జీయంగార్, శ్రీశ్రీశ్రీ చిన జీయంగార్ స్వాముల చేతుల మీదుగా, తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్, ముద్రనారాయణలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన మాట్లాడుతూ శ్రీశ్రీశ్రీ రామానుజాచార్యుల వారి తల్లి గారైన భూపిరాట్టి పేరు మీదుగా ఈ నూతన రహదారికి పేరు పెట్టడం జరిగిందన్నారు. తిరుపతి అభివృద్దికై పాటుపడుతున్న తామపై ఎన్ని విమర్శలు చేసినా వెనుకడుగు వేయమని, దేశంలోనే తిరుపతి ఖ్యాతిని మరింత విస్తరించేందుకు శ్రమిస్తునే వుంటామన్నారు. మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్ ఇరువురు మాట్లాడుతూ 116 లక్షలతో తిలక్ రోడ్డు నుండి తాతయ్యగుంట గంగమ్మ గుడి వైపుగా జబ్బార్ లే అవుట్ జంక్షన్ వరకు నిర్మించిన భూపిరాట్టి నూతన రహదారిని ప్రారంభించడం జరిగిందన్నారు. తిరుపతి ప్రజల సౌకర్యార్ధం మరిన్ని అభివృద్ది పనులు త్వరలో చేపట్టడం, ప్రారంభించడం జరుగుతుందన్నారు. డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతి ప్రజల అభివృద్దే ప్రధాన అజేండగా ముందుకు వెలుతున్నామని, అభివృద్దిని అడ్డుకునే వారికి ప్రజలే బుద్ది చెబుతారని, తమ కౌన్సిల్ మొత్తం నగరాభివృద్దికై నిరంతరం పాటుపడుతూనే వుంటుందన్నారు.
తిరుపతిలో స్థానిక 19వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీరాములు రెడ్డి టిడిపి పార్టీకి రాజీనామా చేసి, వైఎస్సార్ సీపీలో చేరగా.. తిరుపతి ఎమ్మెల్యే హోదాలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. శ్రీ రాములురెడ్డి ఆదివారం ఉదయం ముత్యాల రెడ్డి పల్లి నుంచి భారీ ర్యాలీతో పద్మావతి పురంలోని భూమన నివాసానికి చేరుకుని వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర రెడ్డి మాట్లాడారు…మన జీవితాల్లో వెలుగులు నింపుతున్న జగనన్నకే మద్దతు ఇద్దాం అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకే ఓట్లు వేసి, జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందాం అని పిలుపునిచ్చారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ రాష్ట్రంలో పేద ప్రజలకు చేసిందేమీ లేదని, అయినా, అధికారం కోసం చంద్రబాబు అండ్ కో మళ్లీ ఓట్లు అడిగేందుకు మీ ముందుకొస్తారు, తస్మాత్ జాగ్రత్త అని ప్రజలను హెచ్చరించారు. జగనన్న చేయూత తోనే తిరుపతి అభివృద్ధిలో దేశంలోనే ఆదర్శవంతంగా నిలిచిందని, పేదల సంక్షేమానికి జగనన్న ప్రభుత్వం కట్టుబడి ఉందని పార్టీలో చేరిన వారందరూ పార్టీ కోసం కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. రాబోవు రోజుల్లో జరిగే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి ని మరలా ముఖ్యమంత్రి చేసుకోవాలని, జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
Read Also..
త్రిపురలో గవర్నర్ గా భాధ్యతలు స్వీకరించిన తర్వాత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీర్వాదం కోసం తిరుమలకు వచ్చా.. తనపై నమ్మకంతో నాకు అప్పగించిన భాధ్యతలను నిర్వర్తించేందుకు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్ధించా.. త్రిపురలో కూడా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం నిర్మించాలని అక్కడి ప్రజలు ఆశీస్సులు.. టిటిడి ఛైర్మన్, ఈవోని కలిసి త్రిపుర ప్రజల భావాలను తెలియజేశాను.. త్వరలోనే త్రిపురలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంను నిర్మించేందుకు టిటిడి ఛైర్మన్, ఈవో సానుకూలంగా స్పందించారు..
Read Also..





Total views : 147292