ఈ నెల డిసెంబర్ 9 న కొత్త ఓటరు నమోదు ప్రక్రియ చివరి రోజు గడువు కావడంతో శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి వినుత కోటా శ్రీకాళహస్తి పట్టణం బస్టాండ్ సర్కిల్ వద్ద క్యాంప్ నిర్వహించి విద్యార్థులు, అర్హత ఉన్న ప్రజలకి ఓటరు నమోదు పై అవగాహన కల్పించి జనసేన పార్టీ ఐటీ సభ్యుల ద్వారా ఓటు లేని వారికి ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టారు. అలాగే ప్రజలకి తమ ఓటు ఉందో లేదో పరిశీలించుకునే అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు అనే ఆయుధంతో ప్రజల తలరాతలు నిర్దేశిస్తుందని , ఓటు విలువ అందరూ గ్రహించాలని , అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ డిసెంబర్ 9 వ తేదీ లోపు ఓట్లు నమోదు చేసుకోవాలని, మార్పులు చేర్పులు ఉంటే చేసుకోవాలని ,అలాగే ఓటరు లిస్టులో దొంగ ఓట్లు ఉన్నట్లైతే అభ్యతరలు తెలపాలని, గ్రామ, వార్డు స్థాయిలో జనసేన నాయకులు, జనసైనికులు పరిశీలించి ఈ ప్రక్రియ పూర్తి చెయ్యాలని కోరారు.
Tag:
vinutha kota
జగన్ కి ఓటు వేస్తే నడి రోడ్డుకు తెచ్చేశాడు. జగనన్న ఇళ్లు అని మోసం చేశాడు. తుఫానులో ఇళ్లు అన్ని కొట్టుకుని పోయాయి. కనీసం తాగడానికి నీళ్ళు ఇవ్వలేదు, అన్నం పెట్టలేదు. శ్రీకాళహస్తిలో బీసీ హాస్టల్ లో పెట్టిన తుఫాను బాధితులు జనసేన పార్టీ ఇంఛార్జి వినుత కోటా గారితో ఆవేదన వ్యక్తం చేశారు.
శ్రీకాళహస్తి జనసేన పార్టీ కార్యాలయంలో ఇంఛార్జి వినుత కోటా, వీరమహిళలు, జనసైనికులతో 2,000 మంది తుఫాను బాధితులకు బోజన ఏర్పాట్లు చేసారు.





Total views : 78877