రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజయరామరాజు పేర్కొన్నారు. 14 వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కడప నగరంలోని కోటిరెడ్డి సర్కిల్లో అవగాహన ర్యాలీనీ జెండా ఊపి ప్రారంభించిన సందర్బంగా ఆయన తెలిపారు. ఇప్పటికే అన్ని పార్టీల రాజకీయ నాయకులతో ఎన్నికలకు సంబంధించి అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన చెప్పారు. అవగాహన ర్యాలీ కోటి రెడ్డి సర్కిల్, సంధ్య సర్కిల్ మీదుగా కొనసాగింది. అనంతరం మహావీర్ సర్కిల్ లో మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గణేష్, మున్సిపల్ కమిషనర్ సూర్య సాయి ప్రవీణ్ చంద్, ఆర్డీవో మధుసూధన్, కడప తహశీల్దార్ శివ రామిరెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.
voters
కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంటింటికీ తిరిగి బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని కరీంనగర్ బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకులు విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నారనీ, ఓటర్ లిస్టు పట్టుకుని ఒక్కొక్కరికి రూ.10 వేలు ఇస్తూ ఆ లిస్ట్ పై పెయిడ్ అని రాసుకుంటున్నా పోలీసులు పట్టించుకోవడంలేదన్నారు. పోలీస్ కమిషనర్ పూర్తి నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నప్పటికీ… కిందిస్థాయి సిబ్బంది మాత్రం బీఆర్ఎస్ తొత్తులుగా మారారు అని అన్నారు.బీజేపీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
తెలంగాణలో పార్టీ ప్రచారం ముగిసింది. మైకులు మూగబోయాయి. చివరి రోజు ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు తమ ప్రచారాన్ని హోరెత్తించారు. రోడ్ షో లతో హడావుడి చేశారు. ఇక ఓటర్ పై భారం వేశారు. సీఎం కేసీఆర్, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక, బీజేపీ తరఫున మహారాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎంలు, కేటీఆర్, హరీశ్ రావు, రేవంత్ రెడ్డి సహా పలు పార్టీల ముఖ్య నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంత జిల్లాల్లో గంట ముందుగానే పోలింగ్ ముగియనుంది. జిల్లాలో మొత్తం ఐదు నియోజకవర్గాల్లో 9,66,439 మంది ఓటర్లు ఉన్నారు. 1098 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 320 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. మొత్తం 95 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. పొత్తులో భాగంగా కాంగ్రెస్ నాలుగు స్థానాల్లో, కొత్తగూడెంలో సీపీఐ పోటీలో ఉంది. బీజేపీ, జనసేన కూటమి నేపథ్యంలో బీజేపీ మూడు స్థానాల్లో, జనసేన రెండు స్థానాల్లో పోటీకి దిగింది. ఏ పార్టీ భవితవ్యం ఏంటనేది ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంటుంది. డిసెంబర్ 3న ఇక తెలంగాణను ఏలేది ఏ పార్టీ అనేది తేలిపోతుంది. ఓటర్లు ఎవరిని దీవిస్తారు? ఎవరికి పట్టం కడతారు? అనే అంశంపై ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు రాజకీయ నేతలు. అయితే, అంతకంటే ముందుగానే.. జనం నాడి ఏంటి? ప్రజలు ఎవరి వైపు ఉన్నారు? ఏ పార్టీకి అధికారం కట్టబెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు? అనే అంశాన్ని తేల్చేందుకు అనేక సంస్థలు సర్వేలు నిర్వహించాయి. ప్రజల మూడ్ ఏంటో తెలుసుకున్నాయి. వారు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారో నిర్ధారించాయి.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గల్లో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది. అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలతోపాటు స్వతంత్ర అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అన్ని పార్టీల నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రజలు ప్రస్తుత సర్కారును మళ్లీ అధికారంలో తెస్తారా లేక కొత్త ప్రభుత్వానికి పట్టం కడతార అన్నది తెలియాల్సి ఉంది. ఈ నెల 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.





Total views : 80353