50
విశాఖలోని ద్వారక ఆర్టీసీ బస్ స్టాండ్లో బంగారు ఆభరణాల చోరీ ఘటన చోటుచేసుకుంది. కాకినాడ కి వెళ్ళేందుకు సిద్ధమైన ఒక మహిళా ప్రయాణికురాలిని లక్ష్యంగా చేసుకుని, ఇద్దరు మహిళలు చాకచక్యంగా బ్యాగులోనుంచి 35 తులాల బంగారు ఆభరణాలను అపహరించారు. సీసీటీవి కెమెరాల్లో దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఇద్దరు మహిళా దొంగలు పరారీలో ఉన్నారు. బాధితురాలు పీఎస్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితులను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.





Total views : 80182