Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Andhra Pradesh గోదావరికి వరద పోటెత్తితే లంక గ్రామాలపై ప్రభావం..

గోదావరికి వరద పోటెత్తితే లంక గ్రామాలపై ప్రభావం..

by CVR NEWS
గోదావరికి వరద పోటెత్తితే లంక గ్రామాలపై ప్రభావం

అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి. గన్నవరం మండలంలోని ఊడిమూడి లంక, బూరుగులంక, గంటి పెదపూడి, ఉచ్చుల వారి పాలెం లంక గ్రామాల ప్రజలు.. ప్రతి సంవత్సరం గోదావరి నది వరదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద కష్టాల నుంచి గట్టేక్కేందుకు బ్రిడ్జి నిర్మించాలని దశాబ్దాలుగు కోరుతున్నా..నేటికీ వారధి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. ప్రతీ సంవత్సరం వర్షాకాలంలో గోదావరికి వరద పోటెత్త డంతో ఆ ప్రభావం ఈ లంక గ్రామాలపై పడ్తుంది. వరద తాకిడి దృష్ట్యా రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులు, కూరగాయలను పడవలపైనే బయటకు తరలించాల్సిన వస్తుంది. ఇక ఉపాధి కోసం బయట ఊర్లకు, మండలానికి వెళ్లాలన్నా….విద్యార్థులు..తమ స్కూల్, కాలేజీలకు వెళ్లాలన్న ఈ పడవలపైనే ప్రయాణించాల్సి వస్తుంది. ఇక అత్యవసర పరిస్థితులలో ఎవర్నైనా హాస్పిటల్ కు చేర్చాలన్న ఈ పడవలే ఆధారం…దీంతో వర్షకాలం వచ్చిందంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవించాల్సి వస్తుందని స్థానికులు వాపోతున్నారు. 2024లో వచ్చిన వరద సమయంలో, పది మంది ప్రయాణిస్తున్న పడవ ఒక్కసారిగా మునిగిపోయింది. తొమ్మిది మంది సురక్షితంగా ప్రమాదం నుంచి బయట పడగా..ఒకరు మృతి చెందారు. నేటికీ స్థానికులను ఆ భయం వెంటాడుతోంది.

( ) 2022లో వచ్చిన భారీ వరదల తర్వాత అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ ఈ లంక గ్రామాలను స్వయంగా పరిశీలించారు. ఈ నాలుగు గ్రామాలకు ఉపయోగపడేలా బ్రిడ్జ్ నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. అదే సంవత్సరంలో 49 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభమయ్యాయి. అయితే అప్పటి ప్రభుత్వం..తదుపరి కాలంలో నిధులు మంజూరు చేయకపోవడం వల్ల కాంట్రాక్టర్లు తమ సొంత డబ్బుతో మాత్రమే కొంతమేర పనులు కొనసాగించారు. నిధుల కొరత కారణంగా పనిని నిలిపివేయడంతో.. ఒక సంవత్సరం పాటు పనులు పూర్తిగా ఆగిపోయాయి. దీంతో బ్రిడ్జి కోసం ఎదురు చూస్తున్న స్థానికులు.. ఎన్ని రోజులలో పనులు పూర్తవుతాయో తెలియక అయోమయంలో పడ్డారు. మళ్లీ స్థానికులు.. ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరుగుతూ..బ్రడ్జి నిర్మాణం పూర్తి చేయాలంటూ మొరపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తదానంతరం
ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో బ్రిడ్జ్ పనులు మళ్ళీ ప్రారంభం కాగా..ప్రస్తుతం బ్రిడ్జ్ నిర్మాణం కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం ఇప్పటికే 22 కోట్ల రూపాయలు మంజూరు చేసింందని.. ప్రస్తుతం పనులు సాగుతున్నాయిని..వచ్చే వర్షాకాలానికి బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

014508
Total views : 80404

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.