సికింద్రాబాద్(Secunderabad) కంటోన్మెంట్ బీఆర్ఎస్(Cantonment BRS) అభ్యర్థి నివేదిత ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.. నివేదిత ఇంటిముందు రెండు పడకగదుల భాదితులు ఆందోళనకు దిగారు.. మారేడ్ పల్లి మడ్ రోడ్ వద్ద రెండు పడకల గదుల ఇల్లు ఇప్పిస్తామని డబ్బులు తీసుకోని మమల్ని మోసం చేశారని వారు ఆరోపించారు.
30 మంది కి పైగా భాదితుల నుండి డబ్బులు తీసుకుని ఇల్లులు ఇవ్వడం లేదని ఆందోళనకారులు మండిపడుతున్నారు.. ఎమ్మెల్యే సాయన్న ఉన్న సమయంలోనే డబ్బులు ఇచ్చామని ఇప్పుడు మా డబ్బులు తిరిగి చెల్లించాలని భాదితులు డిమాండ్ చేస్తున్నారు.