నేడు బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం జిల్లా వెళ్లనున్నారు. పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలం జీళ్లచెరువులో 30 ఎకరాల విస్తీర్ణంలో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. జిల్లాలోనే తొలి ఎన్నికల ప్రచార బహిరంగ సభ కావడం.. పోరుబిడ్డ, సీఎం కేసీఆర్ హాజరవుతుండడంతో స్వాగతం పలికేందుకు నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే జనసమీకరణపై దృష్టి సారించిన పాలేరు ఎమ్మెల్యే, అభ్యర్థి కందాళ ఉపేందర్రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్.. పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలోని మండలాలు, గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేసిన ఎమ్మెల్యే కందాళ.. సీఎం సభకు ప్రజలు, లబ్ధిదారులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీఎం కేసీఆర్ తొలి సభ నిర్వహిస్తుండడంతో రాజకీయ వాతావరణం వేడెక్కనుంది.
Khammam
ఖమ్మం పట్టణంలోని తుమ్మల గడ్డలో ఈరోజు నిర్వహించిన మైనారిటీ ఆత్మీయ సమావేశం లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ … మైనార్టీల సంక్షేమం తో పాటు వారికి రాజకీయ అవకాశాలు దక్కేలా పాటుపడ్డానని అన్నారు. నలబై ఏళ్ల రాజకీయ జీవితంలో ఖమ్మం మైనార్టీలు నాకు అండగా ఉన్నారని అన్నారు . ఖమ్మం పట్టణంలో రహదారులు , మున్నేరు పై హైలెవల్ బ్రిడ్జ్ లతో ప్రగతి బాటలు వేశానని ,అరాచక, అవినీతిలేని ప్రశాంతమైన ఖమ్మం కోసం మైనార్టీ సోదరులు ఆలోచన చేయాలని సూచించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏ క్షణంలో అయినా బీజేపీఅభ్యర్థుల ప్రకటన రావొచ్చని ఎంపీ లక్ష్మణ్ వెల్లడించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. మూడు రాష్ట్రాల అభ్యర్థుల ఎంపికపై భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ చర్చించిందని తెలిపారు. తెలంగాణ నుంచి 50కి పైగా స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేసినట్లు వివరించారు.
అభ్యర్థుల ఎంపికలో బీజేపీ సామాజిక న్యాయం పాటిస్తుందన్నారు. సీట్ల కేటాయింపులో మహిళలు, బీసీలకు పెద్దపీట వేశామన్నారు. మొదటి విడతలో బీసీలకు 20కి పైగా సీట్లు కేటాయిస్తున్నామన్నారు. మహిళా రిజర్వేషన్కు సంబంధించి దిల్లీలో ఎమ్మెల్సీ కవిత ధర్నాలు చేశారు.. కానీ, మహిళలకు బీఆర్ఎస్ సీట్లు కేటాయించలేదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ బీసీలను పట్టించుకోవడం లేదన్నారు. రాజాసింగ్ సస్పెన్షన్, పోటీ అంశాన్ని అధిష్ఠానం పరిశీలిస్తోంది అని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు.
ఖమ్మం పట్టణంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి తుమ్మల హాట్ కామెంట్స్ చేసారు . మంత్రి పువ్వాడ ను ఉద్దేశించి మాట్లాడుతూ మేము బందిపోట్లం కాదు బరాబర్ గా పట్టపగలు మీ ముందుకు వచ్చాము అంటూ సవాల్ విసిరారు . విజయం సాధించి తీరుతాం అంటూ ధీమా వ్యక్తం చేశారు. కొన్నేళ్లుగా ఖమ్మం ప్రాంత ప్రజలు భయాందోళనతో జీవితం సాగిస్తున్నారని , మీ కోసం ఎంత దూరమైనా మీ వెంట ఉంటానని తుమ్మల అన్నారు.




Total views : 194132