మెదక్ నియోజకవర్గంలోని ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ సభలో కాంగ్రెస్ ను ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టన పార్టీ కాంగ్రెస్ అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణను ఆంధ్రలో కలిపిందే కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. 50ఏళ్లు కాంగ్రెస్ పాలించినా నీళ్లు రాలేదన్నారు. కాంగ్రెస్ వస్తే మళ్లీ భయంకరమైన పరిస్థితులు వస్తాయని తెలిపారు. రైతుబంధును పుట్టించిందే బీఆర్ఎస్ అని రైతుబంధు దుబారా అని కాంగ్రెస్ నేతలంటున్నారన్నారు. ఇక రైతుబంధు ఉండాలా? వాద్దా ? అనేది ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తారని ధరణి పోతే దళారులు, పైరవీకారులు వస్తారని మండిపడ్డారు. ఎన్నికలు రాగానే ఆగమాగం కావోద్దని గత ప్రభుత్వ వైఖరి, ఈ ప్రభుత్వ వైఖరేంటో ఆలోచించి ఓటేయండని సూచించారు.
Medak
మెదక్ జిల్లా లో ఈనెల 16 న నర్సాపూర్ లో నిర్వహించే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లు మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. హెలిప్యాడ్, సభ వేదిక, సభా ప్రాంగణం ఏర్పాటు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, పెద్ద సంఖ్యలో తరలి వచ్చే పార్టీ శ్రేణులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించిన మంత్రి హరీశ్ రావు సూచించారు.
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంరోని చైతన్య నగర్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాటా శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. స్ధానిక భయాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను ఆకట్టుకుంటూ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఓ హోటల్ లో దోశలు వేసి ఓటర్లను ఆకట్టుకుంటూ ఎన్నికల ప్రచారంలో కాటా శ్రీనివాస్ గౌడ్ దూసుకెళుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.. పటాన్ చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఒకసారి అవకాశం ఇవ్వాలని ఆయన అభ్యర్ధించారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పధకాలను అమలు చేసేందుకు ప్రజలు తమకు అవకాశం కల్పించాలని కోరారు.. మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టి పబ్బం గడుపుకునే పార్టీలకు ప్రజలు గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు..
గులాబీ బాస్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం చేస్తూప్రతిపక్షాలకు కౌంటర్ ఇస్తున్నారు. ఇక.. రెండోవిడత ప్రచారంలో భాగంగా కారు స్పీడ్ పెంచారు గులాబీ దళపతి. ఇవాళ నాలుగు చోట్ల ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన పాల్గొననున్నారు. ఉమ్మడి నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో ఇవాళ సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. బోధన్, నిజామాబాద్, ఎల్లారెడ్డి, మెదక్లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొని, ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.
మెదక్ పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం.. దీపావళి పండుగ సందర్భంగా టపాకాయలు కొనడానికి తల్లి తో పాటు చిన్నారులు స్కూటీ పై వెళ్తుండగా స్కూటీని ఢీ కొట్టిన టిప్పర్ అక్కడికక్కడే ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. తల్లికి గాయాలయ్యాయి. స్థానిక ఆసుపత్రికి తరలించారు. బాధితులు హోమ్ గార్డ్ కుటుంబ సభ్యులుగా పోలీసులు గుర్తించారు.
సంగారెడ్డి పటాన్ చేరు( మం) పాశమైలారం పారిశ్రామిక వాడలో రసాయన పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. 4గురు కార్మికులు కు గాయాలయ్యాయి, ఇంటర్మీడియట్ సాల్వెంట్ తయారు చేసే పరిశ్రమ. ఘటన స్థలానికి చేరుకున్న 2 ఫైర్ ఇంజన్లు స్థానిక ఫైర్ స్టేషన్ లో పనిచేసే ముగ్గురు ఔట్ సోర్స్ ఉద్యోగులు కు మంటలు ఆర్పుతుండగా గాయాలవ్వడంతో ఆసుపత్రికి తరలించారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి.
Read Also..
ఈ మంత్రి హరీష్ రావు గారు సందర్బంగా మాట్లాడుతు సిద్దిపేట ప్రజలే ప్రచారకులు ప్రజల ఆలోచన లు ప్రజల మనసు లోని కోరుకునే అభివృద్ధి కళ్ళముందు ఉంచాను ఆశీర్వదించండి. సిద్దిపేట ప్రజల ఆలోచన అభివృద్ధి పరీక్ష వ్రాసాను ఎన్ని మార్కులు వేస్తారో మీ నిర్ణయం ఎన్నికలప్పుడు వచ్చేది. ఎవరు ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉండేది ఎవరు సిద్దిపేట ప్రజలు ఆలోచించాలి. సిద్దిపేట పేరు ప్రతిష్ట ను గౌరవాన్ని పెంచుకున్నాం. మరింత నిలబెట్టుక్కనేది ప్రజల ఆలోచన ఏడవసారి బి ఆర్ ఎస్ పార్టీ తరపున నామినేషన్ దాఖలు చేశాను. సిద్దిపేట ప్రజల ఆశీర్వాదం తో మంచి మెజార్టీ తో గెలిపించండి. ప్రతిరోజూ మీ కోసం 18గంటలు కష్టపడ్డ. మీ కష్ట సుఖల్లో ఉన్న సిద్దిపేట ప్రజలు నా కుటుంబ సభ్యులు ఆరు సార్లు అద్భుత విజయం అందించి సేవ చేసే అవకాశం ఇచ్చారు. ఐదేళ్లు కష్టపడి పనిచేశా మీ ఆత్మా సాక్షిగా నాకు మార్కులు వేయండి. సిద్దిపేట ప్రజలు కోరుకున్న పనులే కాకుండా కోరని ఎన్నో పనులు చేశా. ఆనాడు తెలంగాణలో కరువు కాటకాలు, ఆకలి చావులు, వలసలు ఉండేవి. నేడు రాష్ట్రాన్ని కెసిఆర్ రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దారు. రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో 24లక్షల ఉద్యోగాలు, ఐటీ లో 6లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ రంగంలో లక్ష 80వేల ఉద్యోగాలు కల్పించాం. కొంతమంది ప్రక్క రాష్ట్రం నాయకులు ఇక్కడ ప్రచారం చేస్తున్నారు, వారు ఇక్కడ ఎం చెప్పదలచుకున్నారు ,ఓటు అడిగే నైతికత లేదు. దేశానికి దిక్సూచిగా తెలంగాణ ను కెసిఆర్ తీర్చిదిద్దారు. కెసిఆర్ పై సెన్సేషన్ ల్ కామెంట్స్ కోసం నోరు జారీ మాట్లాడుతున్నారు. అప్పుడే పుట్టిన బిడ్డ తల్లి చేతుల్లో ఉంటే ఎలా క్షేమంగా ఉంటాదో కెసిఆర్ చేతుల్లో కూడా రాష్ట్రం అలాగే ఉంటది. నమ్మిన నాయకుడు కెసిఆర్ నీ కాదని ఇతర పార్టీలకు ఓట్లు వేయద్దు. బీజేపీ, కాంగ్రెస్ వాళ్లకు ఓటు వేస్తే 10ఎండ్లు తిరిగి వెనుకకు రాష్ట్రం పోతుంది. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ బీజేపి వాళ్ళు అభివృద్ధి చేయలేదు. సిద్దిపేట ప్రజలపై నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది.
దుబ్బాక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి అంబులెన్స్ లో వచ్చి నామినేషన్ వేశారు. ఎన్నికల ప్రచారం సమయంలో ఆయన కత్తిపోటుకు గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రి నుంచి అంబులెన్సులో ఆయన దుబ్బాకకు వచ్చారు. ఆయన సహాయకులు వీల్ ఛైర్ లో ఆయనను రిటర్నింగ్ ఆఫీసర్ వద్దకు తీసుకెళ్లారు. అంతకు ముందు దుబ్బాకలో ఆయన భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు కూడా పాల్గొన్నారు. అక్టోబర్ 30న దుబ్బాక నియోజకవర్గంలోని మిరుదొడ్డిలో ప్రచారం నిర్వహిస్తుండగా ఆయనపై గటాని రాజు అనే వ్యక్తి కత్తితో దాడి చేసి ఆయన పొత్తికడుపులో పొడిచాడు.






Total views : 75134