Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home Andhra Pradesh పోలవరం నిర్మాణం పై కేంద్రం తీవ్ర ఆగ్రహం..!

పోలవరం నిర్మాణం పై కేంద్రం తీవ్ర ఆగ్రహం..!

by Satya
Construction of Polavaram

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో రాష్ట్రం వ్యవహరిస్తున్న తీరుపై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వద్దన్నా నీళ్లు నింపుతున్నారని, కాఫర్ డ్యాం కొట్టుకుపోతే ఎవరు బాధ్యులని నిలదీసింది. గైడ్ బండ్ కుంగడానికి బాధ్యత ఎవరిదో ఎందుకు నిర్ధారించలేదని ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రాజెక్టు విషయంలో ఏ మాత్రం సీరియస్ నెస్ లేదని అర్ధమౌతోందని వ్యాఖ్యానించింది. మరో 15 రోజుల్లో తిరిగి సమావేశం కావాలని , అప్పటికి నిర్ధేశించిన అంశాల్లో కొన్ని పూర్తి చేసుకుని రావాలని ఆదేశించింది. ఢిల్లీలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ అంశాలపై కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ, కేంద్ర జలశక్తి మంత్రి సలహాదారు వెదిరె శ్రీరామ్ సమావేశం నిర్వహించారు.

Advertisements

You may also like

Our Visitor

039664
Total views : 199092

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: