Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

Friday, May 1, 2026
Home Latest News బరిలోకి దిగిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే..

బరిలోకి దిగిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే..

by Rama
Vodithala satish kumar

హుస్నాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి వోడితల సతీష్ కుమార్.. వోడితల సతీష్ కుమార్ 1965లో జన్మించారు. తండ్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావు రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. డిజైన్ ఇంజనీర్ విభాగంలో సతీష్ కుమార్ ఎంటెక్ పూర్తి చేశారు. 1989 లో రాజకీయాలలోకి ప్రవేశించారు. 1995లో సింగాపూర్ గ్రామ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2001లో టిఆర్ఎస్ లో చేరి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. 2002లో హుజురాబాద్ టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2005 లో తుమ్మనపల్లి ఫ్యాక్స్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. 2006లో వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ గా ఎన్నికయ్యారు. 2012 లో టిఆర్ఎస్ పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించబడ్డారు. 2014లో టిఆర్ఎస్ పార్టీ నుండి హుస్నాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. తిరిగి 2018 ఎన్నికల్లో ప్రత్యర్థి పై 70 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తో ఎమ్మెల్యే సతీష్ కుమార్ కుటుంబం సన్నిహిత సంబంధం కలిగి ఉంది. ముచ్చటగా మూడోసారి హుస్నాబాద్ అసెంబ్లీ నుండి భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా ఎమ్మెల్యే సతీష్ కుమార్ బరిలోకి దిగారు.

Advertisements

You may also like

Our Visitor

009338
Total views : 61691

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.