368
ఏపీలో ఐదేళ్ల పాటు ఓ వెలుగు వెలిగిన వైసీపీ నేతలు కనుమరుగైపోయారు. ఉన్న పదకొండు మంది ప్రజా ప్రతినిధుల ముఖంలో కళ తప్పింది. ఇన్నాళ్లూ కన్నూమిన్నూ కానకుండా.. ప్రవర్తించిన నాయకులంతా అండర్గ్రౌండ్కు వెళ్లిపోయారు. ఇక, ఊహించని ఘోర ఓటమిని జీర్ణించుకోలేక జగన్ అసహనానికి గురవుతున్నారు. ఈవీఎంలపై నెపం నెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఆ పార్టీ నాయకుడు రాపాక వరప్రసాద్ మాత్రం ట్యాంపరింగ్ అబద్ధమంటూ జగన్ వ్యాఖ్యలను కొట్టిపారేస్తున్నారు. జనం ఓటేయకపోతే ఈవీఎంలు ఏం చేస్తాయని రాపాక ప్రశ్నించారుమరోవైపు.. వైఎస్ జగన్ను నమ్మి నిండా మునిగామని ఆపార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు.. కొద్దిరోజుల్లో వైసీపీ ఖాళీ అవుతుందని సొంతపార్టీ సీనియర్ నేతలే చెబుతున్నారు. ఇక, అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం సమయంలో వైఎస్ జగన్ తడబడ్డారు. తన పేరునే పూర్తిగా చదవలేకపోయారు. ఇక, అసెంబ్లీలో తీవ్ర విచారవదనంలో వైఎస్ జగన్ కనిపించారుఅటు.. వైసీపీ ఎంపీ మిథున్రెడ్డి బీజేపీ వైపు చూస్తున్నారని చెబుతున్నారు. తన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా బీజేపీలోకి రమ్మని మిథున్రెడ్డి ఒత్తిడి తెస్తున్నారట. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పేల్చిన ఈ బాంబు వైసీపీ బాక్సు బద్దలు చేస్తోంది. జగన్కు బైబై చెప్పే ఆలోచనలో వైసీపీ ప్రజా ప్రతినిధులు ఉన్నారన్న వాదనకు బలం చేకూర్చింది. కొంతకాలానికి వైసీపీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు మిగిలే పరిస్థితి లేదని ఆ పార్టీ నేతలే అంటున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే వైసీపీ ఖాళీ అవడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- పూణేలో కూలిన శిక్షణ విమానం..మహారాష్ట్ర పుణే జిల్లా బారామతిలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. శిక్షణకు ఉపయోగించే ఓ విమానం సాంకేతికలోపంతో కూలిపోయింది. ఈ ఘటనలో ట్రైనీ పైలట్కు గాయాలయ్యాయి. రెడ్బర్డ్ ఏవియేషన్ సంస్థకు చెందిన విమానం శిక్షణ కార్యక్రమంలో ఉండగా అందులో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో…
- సోనియాగాంధీకి మరోసారి అస్వస్థత…కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ సోనియాగాంధీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో గురుగ్రామ్లోని వేదాంత ఆస్పత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం సోనియాగాంధీ ఆరోగ్యంనిలకడగా ఉందని వెల్లడించారు వైద్యులు. ఆమె వెంట కుమార్తె ప్రియాంక, కుమారుడు రాహుల్ గాంధీ ఉన్నారు. ఇటీవల…
- విజయ్ కు 144 మంది సభ్యుల మద్దతు..తమిళనాడు అసెంబ్లీలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. గంటల తరబడి సాగిన ఉత్కంఠకు తెరదించుతూ.. తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ నేతృత్వంలోని TVK ప్రభుత్వం బలపరీక్షలో ఘన విజయం సాధించింది. ప్రతిపక్షాల వ్యూహాలను చిత్తు చేస్తూ, ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి చరమగీతం పాడుతూ…
- Gujarat Titans ఘన విజయం.. Sunrisers Hyderabad 86 పరుగులకే కుప్పకూలింది..Sunrisers Hyderabad 169 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఘోరమైన బ్యాటింగ్ పతనాన్ని ఎదుర్కొంది. చివరకు 14.5 ఓవర్లలో కేవలం 86 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ ఆరంభమే విపత్తుగా మారింది. Mohammed Siraj వేసిన తొలి ఓవర్లోనే Travis…
- యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో కబేళాలకు తరలిస్తున్న ఆవుల పట్టివేత…యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో అక్రమంగా కబేళాలకు తరలిస్తున్న ఆవులను పట్టుకున్నారు పోలీసులు. రాజమండ్రి నుంచి బహదూర్పురా కబేళాకు తరలిస్తుండగా పట్టుకున్నారు. పైన సిమెంట్ బ్రిక్స్ను అమర్చి కిందిభాగంలో ఏర్పాటుచేసిన బాక్సుల్లో ఆవులను తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న బజరంగ్దళ్ కార్యకర్తలు పోలీసులకు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.






Total views : 74820