తెలంగాణలో జూనియర్ డాక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు. జూడాల సమస్యల పరిష్కారంతో పాటు వారి డిమాండ్లు నెరవేర్చడంపై మంత్రి దామోదర రాజనర్సింహ హామీ ఇచ్చారు. దాంతో జూడాలు సమ్మె విరమించారు. ఇవ్వడంతో జూడాలు సమ్మె విరమణకు అంగీకరించారు. జూనియర్ డాక్టర్లు మొత్తం ఎనిమిది డిమాండ్లు ప్రభుత్వం ముందుంచగా.. ప్రస్తుతం 6 డిమాండ్లు పరిష్కారానికి వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సానుకూలత వ్యక్తం చేయడంతో జూడాలు వెనక్కి తగ్గారు.
నిధుల విడుదలకు జీవోలు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం ఉస్మానియా, గాంధీ హాస్పిటల్, కాకతీయ మెడికల్ కాలేజీలలో వసతుల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం ఇదివరకే నిర్ణయం తీసుకుంది. జూడాలతో చర్చలు జరిపిన తరువాత గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్స్ జూనియర్ డాక్టర్ల వసతిగృహాల నిర్మాణానికి ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దాంతోపాటు వరంగల్ లోని కాకతీయ మెడికల్ కాలేజీలో రహదారుల పునరుద్ధరణ కోసం నిధుల ఇచ్చేందుకు 204.85 కోట్లు కేటాయిస్తూ జీవో ఇచ్చింది. ఉస్మానియా, గాంధీలో ఆస్పత్రిలో హాస్టల్స్ నిర్మాణానికి 121.90 కోట్లు, 79.50 కోట్లు.. కాకతీయ యూనివర్సిటీలో రోడ్ల కోసం 2.75 కోట్ల మేర తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేయడం తెలిసిందే. దీంతో మొదట జూనియర్ డాక్టర్లు తాత్కాలికంగా సమ్మె విరమణకు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం రెండు జీవోలు జారీ చేసింది. ఇతర డిమాండ్లు పరిష్కరించేందుకు వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హామీ ఇవ్వడంతో జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- జనసేన అధినేత పవన్కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.






Total views : 90600