అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం, కుండలేశ్వరంలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. కాట్రేనికోన మండలం కుండలేశ్వరం నక్క వారి పేట లోని ఓ ఇంట్లో క్షుద్ర పూజలు చేస్తున్నారన్నపుకారు షికార్లు చేస్తోంది. దాంతో స్థానికులు ఈ విషయంతెలిసి బెంబేలె త్తి పోతున్నారు. సమాచారంతో హడలిపోతున్న గ్రామస్తులు…సుమారు నెల రోజుల నుండి గ్రామంలో ఇద్దరు వ్యక్తులు ప్రతిరోజూ అర్ధరాత్రి వేళలో కుండలేశ్వరం స్నాన ఘట్టం వద్దకు వచ్చి స్మశానంలో పూజలు నిర్వహించడం చూసామని గ్రామస్థులు చెబుతున్నారు. అర్ధరాత్రి వేళలో పసుపు రాసుకుని దిగంబరంగా పూజలు చేస్తున్నారనే పుకార్లు చెక్కెర్లు కొడుతున్నాయి. దాంతో ప్రజలు భయం గుప్పెట్లో గజగజ వణికి పోతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా లో క్షుద్ర పూజలు కలకలం ఆ నోట ఈ నోట గ్రామమంతా పాకడం తో ఆ ఇంటి ముందు నుంచి వెళ్లడం మానేసారు. ఇక ఈ విషయం పోలీసులకు చేరడంతో.. అకాస్మిక దాడుల నిర్వహించారు. దాంతో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- అన్నమయ్య జిల్లాలో విషాదం…అన్నమయ్య జిల్లా పుంగనూరులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బైక్ నుంచి వచ్చే పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. పుంగనూరు త్యాగరాజు వీధిలో ఈ ఘటన జరిగింది. మృతిచెందిన వారిని తాత, మనవడు, ఇద్దరు మనవరాళ్లుగా గుర్తించారు.…
- నిర్భయ నిధి కింద ‘ములుగు’ జిల్లా ఎంపిక కావడం పట్ల మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు.నిర్భయ నిధి కింద ‘ములుగు’ జిల్లా ఎంపిక కావడం పట్ల మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణ దేవిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. నిర్భయ నిధి పథకం ద్వారా జిల్లాలో…
- అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు మంత్రి నారాయణ.అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు మంత్రి నారాయణ. పనులు ప్రారంభించిన 6 నెలల్లోనే సంబంధిత పనులు పూర్తి చేస్తామన్నారు. అనంతవరం, నెక్కలు గ్రామసభలకు మంత్రి హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, సీఆర్డీఏ అధికారులతో కలిసి…
- ప్రపంచవ్యాప్తంగా యుద్ధ ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో నార్త్ కొరియా ప్రయోగం కొత్త టెన్షన్కు దారితీసింది.ప్రపంచవ్యాప్తంగా యుద్ధ ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో నార్త్ కొరియా ప్రయోగం కొత్త టెన్షన్కు దారితీసింది. జపాన్ సముద్ర జలాల్లోకి నార్త్ కొరియా బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది. తమ దేశ సముద్ర జలాల్లోకి ఏకంగా 10 బాలిస్టిక్ క్షిపణులను ఉత్తర కొరియా ప్రయోగించినట్లు…
- రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో డ్రగ్స్ కలకలం.రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని అజీజ్నగర్లో కాల్పులు కలకలం సృష్టించాయి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్హౌస్లో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న డ్రగ్స్ పార్టీపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఫామ్హౌస్లో మద్యం, డ్రగ్స్ పార్టీ జరుగుతోందన్న పక్కా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి