580
రాజేంద్రనగర్ నియోజకవర్గం అభ్యర్థి తోకల శ్రీనివాస్ రెడ్డి ఉదయం తన నివాసం మైలార్దేవ్పల్లి ప్రజాభవన్ ఆరంగర్ చౌరస్తా నుండి రాజేంద్రనగర్ ఆర్డిఓ కార్యాలయం వరకు కార్యకర్తలతో కలిసి ఊరేగింపుగా వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ. భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం తనను బలపరిచి నందుకుగాను ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో 50 వేల మెజార్టీతో గెలిపించేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారని.. ప్రజల ఆశీర్వాదం ఎల్లవేళనాపై ఉంటుందని. ఎన్నికల్లో ఘన విజయం సాధించి రాజేంద్రనగర్ నియోజకవర్గం లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు. నామినేషన్ దాఖలుకు నియోజకవర్గ వ్యాప్తంగా వచ్చిన కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఇదే ఉత్సాహంతో ఎన్నికల్లో పనిచేస్తామని ఆయన అన్నారు.






Total views : 75349