Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Andhra Pradesh వైసీపీ నేతలకు ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ హెచ్చరిక

వైసీపీ నేతలకు ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ హెచ్చరిక

by Rama
వైసీపీ నేతలకు ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ హెచ్చరిక

ధర్మవరంలో ఐదేళ్ల పాటు విచ్చలవిడిగా కబ్జాలు, ఆక్రమణలు చేశారని.. వీటిన్నింటికీ ఇప్పుడు లెక్క చెప్పాల్సి ఉంటుందని టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ హెచ్చరించారు. ధర్మవరం పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల స్థితిగతులను ఆయన స్వయంగా పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ తో కలసి పలు ప్రాంతాల్లో పర్యటించారు. 28 వ వార్డులో వాటర్ ట్యాంక్, సిద్దయ్యగుట్టలోని సాయిబాబా వాటర్ ట్యాంక్, ఎల్.పి.సర్కిల్లోని అన్న క్యాంటీన్, ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న అన్న క్యాంటీన్ ను పరిశీలించారు. అమృత్ స్కీమ్ కింద మంజూరైన పనులు ఎక్కడికక్కడ ఆగిపోవడంపై శ్రీరామ్ ఆరా తీశారు. వెంటనే పనులు మొదలు పెట్టేలా చూడాలని అధికారులను కోరారు. అలాగే ఐదేళ్లుగా మూతపడ్డ అన్న క్యాంటీన్ల పరిస్థితిని స్వయంగా చూశారు. వెంటనే మరమ్మతులు చేయాలని సూచించారు. ఈసందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ పట్టణంలో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి, అభివృద్ధి పనులు ఎక్కడ ఆగిపోయాయి ఇలాంటి అంశాలు తెలుసుకునేందుకు వచ్చానన్నారు. అలాగే పేద ప్రజలకు తక్కువ ధరకే అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను మూసివేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ పై కక్షతో ప్రజలకు పెట్టే భోజనాన్ని దూరం చేశారన్నారు. త్వరలోనే అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తామన్నారు. అలాగే వార్డుల వారిగా సమస్యలు ఏమున్నాయి, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్న దానిపై ఒక సమీక్ష చేసుకుని మంత్రి సత్యకుమార్ సహకారంతో వాటన్నింటినీ పూర్తి చేస్తామన్నారు. మరోవైపు తాము ఎక్కడ అభివృద్ధి చేస్తామోనన్న భయంతో వైసీపీ నాయకులు వారి పత్రిక ద్వారా విషం చిమ్మిస్తున్నారన్నారు. ఐదేళ్ల పాటు మున్సిపల్ స్థలాలు కబ్జా చేసి, ఎక్కడికక్కడ ఆక్రమణలు చేసిన వారిని ఊరికే వదిలేదిలేదన్నారు. వాటిన్నింటిపై చర్యలు ఉంటాయన్నారు. ఇన్ని రోజులు స్వైర విహారం చేసి.. ఇప్పుడు కూడా అలాగే ఉంటామంటే.. ఊరుకునేది లేదన్నారు. ఆరోజు ధర్మవరంలో ప్రశాంతత కోసం పరిటాల రవి కృషి చేశారని.. ఇప్పుడు కూడా తాము ప్రశాంతత కోసం పని చేస్తామన్నారు. వైసీపీ నాయకులు వారి హద్దుల్లో ఉంటే బాగుంటుందని.. అలా కాదంటే మా నుంచి ప్రతి సమాధానం కూడా ఉంటుందని హెచ్చరించారు…..

FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS

  • రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.
    ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రేపు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ గాయంతో బాధపడుతున్న ఆయన..భుజాలకు సంబంధించిన చికిత్స చేయించుకోనున్నారు. రెండు భుజాల కండరాలు దెబ్బతినడంతో ఇబ్బంది పడుతున్న పవన్‌ కల్యాణ్‌..ముంబై హాస్పిటల్‌లో ఇప్పటికే వైద్య పరీక్షలు…
  • హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.
    అమెరికాలో హెచ్-1బీ, పర్మ్ వర్క్ వీసాల జారీలో జరుగుతున్న అక్రమాలపై ట్రంప్ ప్రభుత్వం భారీ దర్యాప్తు చేపట్టింది. అమెరికా కార్మిక శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి’ఎస్పోసిటో వెల్లడించిన వివరాల ప్రకారం.. వీసా మోసాలపై ఇప్పటికే డజన్ల కొద్దీ సమ్మన్లు, సబ్‌పోనాలు…
  • అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.
    ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగు పడుతోంది. ఇప్పటికే కేంద్ర కార్యాలయాలు, బ్యాంకులు, హోటల్స్, విద్యా సంస్థలతో రూపుదిద్దుకుంటున్న రాజధాని ప్రాంతానికి ఇప్పుడు హైటెక్ స్కై కనెక్టివిటీ కూడా అందుబాటులోకి రానుంది. ఉండవల్లి సమీపంలో ఆధునిక సదుపాయాలతో హెలిపోర్ట్…
  • భారత్-ఆస్ట్రేలియా సీఈఓలతో ప్రధాని మోదీ కీలక భేటీ.
    భారత్-ఆస్ట్రేలియా మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథనీ అల్బనీస్‌తో కలిసి ఇరు దేశాల ప్రముఖ సీఈఓలు, వ్యాపార దిగ్గజాలతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల…
  • చెన్నై ఎగ్మూర్‌లోని ఆస్పత్రుల్లో సీఎం విజయ్‌ ఆకస్మిక తనిఖీలు.
    తమిళనాడు సీఎం విజయ్ పాలనలో తన మార్క్‌ చూపిస్తున్నారు. అవినీతి లేని పాలన అందిస్తానని చెబుతున్న విజయ్‌..ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఆధారాలతో సహా అవినీతి అధికారుల సమాచారం అందిస్తే వారిపై చర్యలు తీసుకుంటానని ప్రకటించిన ముఖ్యమంత్రి..తాజాగా ప్రభుత్వాస్పత్రుల్లో ఆకస్మిక…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

039147
Total views : 194450

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: