అంబాజీపేట మండలం మాచవరం గ్రామపంచాయతీ పరిధిలో చెత్త వ్యర్ధాలను గత సంవత్సరం నుండి ప్రధాన రహదారికి ఇరువైపులా మరియు గ్రామంలో ఎక్కడ పడితే అక్కడ వ్యర్థాలను ఇష్టారీతిన వేస్తున్న ఆ వ్యర్థ పదార్థాలను తొలగించవలసిన గ్రామపంచాయతీ వాళ్ళు నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నారు. దీనికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాచవరం గ్రామపంచాయతీ వద్ద ఒకరోజు రిలే నిరాహార దీక్షను చేపట్టారు. దీనికి మద్దతుగా రైతు సంఘాల నాయకులు, వ్యాపారస్తులు సంఘీభావం ప్రకటించారు. వెంటనే స్పందించిన జిల్లా అధికారులు ఈ సమస్యను సత్వరం పరిష్కరించి వ్యర్ధాలను తొలగిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కామన ప్రభాకర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడునెల్లి వెంకటరమణ, రైతు సంఘాల నాయకుడు పత్తి దత్తుడు, నక్క భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
రహదారికి ఇరువైపులా చెత్త..
341
previous post





Total views : 146999