పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని మాజీ మంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుతో పాటు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ప్రారంభించారు. జాబ్ మేళాలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఆఫర్ లెటర్లను అందజేసి అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇస్తోందని, యువత అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసేలా వైసీపీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. జిల్లాలో నిర్వహిస్తున్న జాబ్ మేళాల ద్వారా ఇప్పటివరకు 6,474 మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించినట్లు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా వెల్లడించారు. ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి జాబ్ మేళాలను నిర్వహిస్తూ మరింత మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మెగా జాబ్ మేళా.
39
previous post




Total views : 146871