Thursday, June 18, 2026
News Navigation
Thursday, June 18, 2026
News Navigation

Breaking

Thursday, June 18, 2026
Home Andhra Pradesh ఏలూరులో ఘనంగా కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయోత్సవ సభ!

ఏలూరులో ఘనంగా కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయోత్సవ సభ!

by CVR NEWS
ఏలూరులో ఘనంగా కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయోత్సవ సభ!

గత వైసీపీ ప్రభుత్వం రైతులను దగా చేస్తే.. వారి సంక్షేమం, అభ్యున్నతి కోసం పోరాడుతున్న ఏకైక ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వమేనని రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి, నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఏలూరు ఇండోర్ స్టేడియంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు బడేటి చంటి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయోత్సవ సభ అత్యంత ఘనంగా జరిగింది. ఈ సభకు జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్, మంత్రి కొలుసు పార్థసారథితో పాటు స్థానిక ఎమ్మెల్యేలు, భారీగా నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి.. జగన్ ఏలూరు జిల్లాకు గొడ్డలి వేటు వేశారని మండిపడ్డారు.మరోవైపు జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో రైతుకే తొలి ప్రాధాన్యత ఉంటుందన్నారు. అన్నదాత సుఖీభవ’ పథకం ద్వారా ప్రతి రైతుకు గత ప్రభుత్వం కంటే అదనంగా లబ్ధి చేకూరుస్తున్నామని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

025304
Total views : 146876

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.