కాకినాడ జిల్లా తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో తాజాగా మరో బిగ్ ట్విస్ట్ వెలుగుచూసింది. చిన్నారి అదృశ్యమైన ప్రాంతంలో ఉన్న కంచెకు హఠాత్తుగా చిన్న చిన్న బొమ్మలు ప్రత్యక్షమవడం తీవ్ర కలకలం రేపుతోంది. రెండు వేర్వేరు చోట్ల ఈ వింత బొమ్మలు కనిపించడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. అయితే ఈ బొమ్మల మిస్టరీపై తుని పోలీసులు క్లారిటీ ఇచ్చారు. సెర్చ్ ఆపరేషన్లో భాగంగానే తామే ఆ బొమ్మలను అక్కడ ఏర్పాటు చేశామని ఎస్సై కృష్ణమాచారి స్పష్టం చేశారు. చిన్నారి అదృశ్యమైన జీడి తోటలో క్రూర జంతువుల కదలికలు ఏమైనా ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి సాంకేతికంగా ఈ బొమ్మలను కట్టామని ఆయన వివరించారు. ఏదేమైనప్పటికీ చిన్నారి ఆచూకీ కోసం జరుగుతున్న గాలింపులో ఈ బొమ్మల ఉదంతం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తుని చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో మరో బిగ్ ట్విస్ట్.
41
previous post





Total views : 146772