Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Andhra PradeshPrakasam షాది ఖానా పూర్తి చేస్తేనే ఓట్లు అడగండి..

షాది ఖానా పూర్తి చేస్తేనే ఓట్లు అడగండి..

by Rama
shadi khana

మార్కాపురం పట్టణంలోని కంభం సెంటర్ షాది ఖానా నిర్మాణాలను స్థానిక ముస్లిం యూత్ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాదిక్ మాట్లాడుతూ 2005వ సంవత్సరంలో దివంగనేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన షాది ఖానా అప్పటినుండి ఇప్పటివరకు నిర్మాణం జరుగుతూనే ఉందని ముస్లిం ప్రజలకు మాయమాటలు చెప్పి నాయకులు కాలం వెల్ల పుచ్చుతున్నారని అన్నారు. సామాజిక సాధికార బస్సు యాత్రలో వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి షాది ఖానా పూర్తి చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. 2005 వ సంవత్సరం నుండి ఇంతవరకు షాది ఖానా పూర్తి చేయకుండా ముస్లింలను మోసం చేస్తూ కాలం గడిపేరే తప్ప ఎలాంటి పురోగతి లేదని అన్నారు. చేయకుండానే చేసినామని చెప్పుకోవడం రాజకీయ లబ్ధి కోసమే తప్ప మరొకటి లేదని విమర్శించారు. ఇప్పటికైనా షాది ఖానా నిర్మాణం పూర్తి చెయ్యకపోతే ముస్లిం మైనార్టీ ప్రజలంతా కలిసి ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. అదేవిధంగా ముస్లిం లీగ్ పార్టీ అధ్యక్షులు ఇస్మాయిల్ మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి షాది ఖానా పూర్తి చేశామని చెప్పడం ప్రజలని మోసం చేయడమే తప్ప మరొకటి లేదన్నారు. 18 సంవత్సరాలుగా షాది ఖానా నిర్మాణం చేపడుతున్నామని మాయ మాటలు చెబుతూ ముస్లింలను మోసం చేస్తున్నారని విమర్శించారు. షాది ఖానా కు 17 లక్షల రూపాయలు ఖర్చు పెడితే రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కాంట్రాక్టుకు బిల్లు చెల్లించలేదని, దానివల్ల నిర్మాణం నిలిచిపోయిందని అన్నారు. ఏ విధంగా షాది ఖానా పూర్తయిందని, ఎవరిని మోసం చేయడానికి చూస్తున్నారని ప్రశ్నించారు. ఆరు నెలల లోపు షాది ఖానా పూర్తి చేస్తే ముస్లిం ప్రజల ఓట్ల అడగండి లేకపోతే అడగవద్దని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Read Also..

Advertisements

You may also like

Our Visitor

039479
Total views : 197051

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: