బీఆర్ఎస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గడపగడపకు తీసుకెళ్లి ప్రజలకు వివరించి రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ను, నియోజకవర్గంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యలకు హ్యాట్రిక్ విజయం అందించాలని కేసీఆర్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ అమీర్ పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని స్థానిక బాబు క్యాంపు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని అనేక హామీలను అమలు చేసిన గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు, కేసీఆర్ కిట్, దళిత బందు, లాంటి అనేక పథకాలు ప్రజలు అడగక పోయిన సీఎం కేసీఆర్ ప్రజల సంక్షేమం గురించి ఆలోచించి పథకాలను అమలు చేస్తున్నాడని తెలిపారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీలోని అన్ని విభాగాల నాయకులు ప్రజల వద్దకు వెళ్లి సంక్షేమ పథకాలను వివరించాలని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.
Read Also..





Total views : 78664