Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Telangana తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

by CVR NEWS
తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌ రెడ్డి వెల్లడించారు. SIR ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. జూన్‌ 25 నుంచి జులై 24 వరకు అధికారులు, బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వెరిఫికేషన్‌ ప్రక్రియ పూర్తి చేస్తారని తెలిపారు. ప్రక్రియలో భాగంగా బీఎల్‌వోలు ప్రతి ఇంటికీ వెళ్లి ఎన్యుమరేషన్‌ ఫామ్‌లు ఇస్తారని సుదర్శన్‌ రెడ్డి వివరించారు. ప్రతి ఓటర్‌కు రెండు ఫామ్‌లు అందుతాయన్నారు. అందులో ఒకటి నింపి తిరిగి బీఎల్‌వోలకు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. రెండో ఫామ్‌ను ఓటరు తమ వద్దే అక్‌నాలెడ్జ్‌మెంట్‌ కింద ఉంచుకోవచ్చని వివరించారు. ఆన్‌లైన్‌లో ఓటర్ల నమోదు కోసం వెబ్‌సైట్‌ ద్వారా కూడా ఎన్యుమరేషన్‌ చేసుకోవచ్చన్నారు. ఈ ఎన్యుమరేషన్‌ ఫామ్‌ల ఆధారంగా జులై 31న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేస్తామని వెల్లడించారు. దీన్ని రాజకీయ పార్టీలకు అందిస్తామన్నారు. అలాగే వెబ్‌సైట్‌లోనూ అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ఈ డ్రాఫ్ట్‌పై జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు ఓటర్లు తమ అభ్యంతరాలను తెలియజేయొచ్చని సుదర్శన్‌ రెడ్డి తెలిపారు. వచ్చిన ఫిర్యాదులన్నింటినీ పరిశీలించిన తర్వాత అక్టోబర్‌ 1న తుది ఓటరు జాబితాను అధికారికంగా ప్రచురిస్తామని వెల్లడించారు. తెలంగాణలో దాదాపు 25 ఏళ్ల క్రితం ఈ SIR ప్రక్రియ జరిగిందని గుర్తుచేశారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

014036
Total views : 78840

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.