Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Andhra PradeshGuntur నాటు సారాను స్వాధీనం చేసుకున్న పోలీసులు..

నాటు సారాను స్వాధీనం చేసుకున్న పోలీసులు..

by Rama
natu sara

పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం నడికుడి ప్రత్తి గూడౌన్లో నాటుసారా తయారీ మెటీరియల్ ని నిన్న రాత్రి దాచేపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గూడెంలో ఉన్న సుమారు 260 బస్తాలు నల్లబెల్లం , స్పటికను, మూడు లీటర్ల నాటు సారాను దాచేపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సంఘటన స్థలంలో గురజాల డిఎస్పి పల్లపురాజు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిఎస్పీ మాట్లాడుతూ మాకు వచ్చిన సమాచారం మేరకు ఈ ప్రత్తి గూడెంలో తనిఖీ చేయగా ఇందులో సుమారు 260 బస్తాల నల్ల బెల్లం మరియు స్పటిక ఉన్నదని , దీనితోపాటు మూడు లీటర్ల నాటుసార కూడా లభ్యమైనదని డిఎస్పి తెలిపారు. వీటి విలువ సుమారు ఐదు లక్షల రూపాయలు ఉంటుందని వారు తెలిపారు. దీని వెనక ఉన్న వ్యక్తి పరారీలో ఉన్నాడని , త్వరలోనే అరెస్ట్ చేసి శిక్షిస్తామని గురజాల డిఎస్పి పల్లపు రాజు తెలిపారు.

Read Also..

Advertisements

You may also like

Our Visitor

014553
Total views : 80459

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.