281
ఆయనొక ఏఈఓ … విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం వద్ద విధులు నిర్వహిస్తూ.. ఆలయానికి వచ్చిన భక్తుల పట్ల మర్యాదగా నడుచుకోవాలి.
కానీ ఆయన మాత్రం నోరు విప్పితే చాలు పచ్చి బూతులే.. గతంలోనూ పలుమార్లు బూతులు తిడుతూ మీడియాలో వెలుగులోకి వచ్చారు. ఆలయ సన్నిధి వద్ద విధులు నిర్వహించే అర్చకులను సైతం బూతులు తిడుతూ, ఒక ధర్మ కర్తను బూతులు తిడుతూ మాట్లాడిన తీరు పై.. పాలక మండలి సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఇప్పటికే సదరు ఏఈఓపై భక్తులు మండిపడుతున్నారు. ఇలాంటి వారి పై తక్షణమే చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు.





Total views : 147560