Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home Andhra PradeshKarnool ప్రమాదవశాత్తు నీటి ట్యాంక్ లో పడి బాలిక మృతి

ప్రమాదవశాత్తు నీటి ట్యాంక్ లో పడి బాలిక మృతి

by Rama
girl died

కర్నూలు జిల్లా నందవరం మండలం జగ్గపురం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలో నివాసం ఉంటున్నా మారెప్ప, రత్నమ్మ ల రెండో కుమార్తె అయినా కృష్ణవేణి(7) ఇంటిలో తాగునిటీ కోసం ఊరి దగ్గర లో ఉన్న నీటి ట్యాంక్ దగ్గరకు వెళ్ళింది. అయితే ఆ ట్యాంక్ లో నీరు అడుగున ఉండటంతో ఓ తాడు సహాయంతో పైకి నీటిని తోడుతుండగా ప్రమాదవాషత్తు కాలు జారీ ఆ నీటి ట్యాంక్ లో బాలిక పడిపోయింది. ఆ బాలిక అరుపులు విన్న వెంటనే పక్కన ఉన్న కొంతమంది వెళ్లి ఆ నీటి ట్యాంక్ లో ఉన్న బాలిక కృష్ణవేణి ను బయటకు తీసి చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వం ఆసుపత్రికు తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షంచగ బాలిక కృష్ణవేణి మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఆ బాలిక మృతితో ఆ గ్రామం మొత్తం విషాదచయాలు అలుముకున్నాయి. ఘటనపై నందవరం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: