Sunday, July 12, 2026
News Navigation
Sunday, July 12, 2026
News Navigation

Breaking

Sunday, July 12, 2026
Home Andhra Pradesh బోటులో అగ్నిప్రమాదం.. 11 మందిని కాపాడిన కోస్ట్ గార్డ్స్‌

బోటులో అగ్నిప్రమాదం.. 11 మందిని కాపాడిన కోస్ట్ గార్డ్స్‌

by Satya
Coast guards rescued 11 people

కాకినాడ తీరంలో వేటకు వెళ్తున్న బోటులో అగ్నిప్రమాదం జరిగింది. నడి సంద్రంలో ఉండగా అందులోని గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. దీంతో మంటలు వ్యాపించాయి. 11 మంది మత్స్యకారులు బోటులో చిక్కుకున్నారు. నిమిషాల్లో బోటు మొత్తం అగ్నికి ఆహుతయింది. లైఫ్ జాకెట్ల సహాయంతో మత్స్యకారులు బోటు నుండి సముద్రంలోకి దూకి, సుమారు గంట వరకు సముద్రంలోనే ఉన్నారు. మత్స్యకారులు జగన్నాథపురం , ఏటిమొగ ప్రాంతానికి చెందినవారు. కాకినాడ తీరంలో గస్తీ నిర్వహిస్తున్న కోస్ట్‌గార్డు సిబ్బందికి సమాచారం చేరవేయడంతో రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టి మత్స్యకారులను కాపాడారు.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Our Visitor

039795
Total views : 200847

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: