Saturday, August 29, 2026
News Navigation
Saturday, August 29, 2026
News Navigation

Breaking

Saturday, August 29, 2026
Home Crime తెలివిగా వ్యవహరించిన దొంగ….

తెలివిగా వ్యవహరించిన దొంగ….

by Prakash
Scenes are recorded in CC camera

రాజన్న సిరిసిల్ల జిల్లా. వేములవాడ పట్టణంలోని గాంధీ నగర్ లో తాళం వేసిన ఇంట్లో అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి 40 వేల రూపాయల నగదు, తులం బంగారం దొంగతనం చేశారు. తిప్పాపూర్ లోని గురుకుల పాఠశాలలో ప్రభుత్వ టీచర్లుగా పనిచేస్తున్న భార్యాభర్తలు ఎలక్షన్ డ్యూటీలో వెళ్లిన సమయంలో చోరీ జరిగినట్లు తెలుస్తుంది. గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడే ముందు సిసి కెమెరాలో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు వేములవాడ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయగా, క్లూస్ టీం రంగంలోకి ఆధారాలు సేకరిస్తుండగా, దొంగ తెలివిగా తన చేతికి గ్లౌజులు వేసుకోవడంతో వేలిముద్రలు సేకరించడంలో కష్టతరంగా మారింది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: