Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Andhra PradeshEast Godavari నారా లోకేష్ ను కలిసిన పిఠాపురం న్యాయవాదులు

నారా లోకేష్ ను కలిసిన పిఠాపురం న్యాయవాదులు

by Rama
Nara lokesh

• జగన్ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం-2023ను రద్దు చేయాలి.
• ఈ చట్టం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉంది.
• సివిల్ కోర్టులకు విచారణ పరిధి లేకుండా చేశారు.
• ప్రభుత్వ పరిధిలో పనిచేసే ల్యాండ్ టైటిలింగ్ అధికారులపై రాజకీయ జోక్యం ఉండే ఆస్కారం ఉంది.
• సివిల్ కేసులు వేగవంతంగా పరిష్కరించాలనుకుంటే కోర్టులు, సిబ్బంది సంఖ్యను పెంచాలి.
• న్యాయవాదులకు రక్షణ చట్టం తీసుకురావాలి.
• జగన్ ప్రభుత్వం న్యాయవాదుల సంక్షేమానికి ఇస్తానన్న రూ.100కోట్లలో రూ.75కోట్లు నేటికీ రాలేదు.
• కోర్టుల్లో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి, నిర్మాణ దశలో ఉన్న కోర్టు భవనాలు పూర్తిచేయాలి.
• ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి కేసులు వేగంగా పరిష్కరించాలి.
• రూ.20 అడ్వకేట్ వెల్ఫేర్ స్టాంపును రద్దు చేసి, రూ.100 వెల్ఫేర్ స్టాంపును అమలు చేయాలి.
• న్యాయవాదుల కుటుంబాలకు ఆరోగ్య బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించాలి.
• 41ఏ సీఆర్పీసీ నోటీసుల దుర్వినియోగం అవుతున్న నేపథ్యంలో కొత్త మార్గదర్శకాలు రూపొందించాలి.
లోకేష్ స్పందిస్తూ…
• జగన్మోహన్ రెడ్డి పాలనలో న్యాయానికి సంకెళ్లు వేసే దుర్మార్గపు సంస్కృతిని తెచ్చాడు.
• న్యాయం కోసం పోరాడే న్యాయవాదులపై దాడులు, అక్రమ కేసులతో వేధింపులకు దిగుతున్నారు.
• సామాన్యుడికి న్యాయాన్ని దూరం చేసేలా నల్ల చట్టాలు తెస్తున్నారు.
• న్యాయమూర్తులను సైతం సైకో సోషల్ మీడియా గ్రూపుల్లో కించపరుస్తున్నారు.
• మేం అధికారంలోకి వచ్చాక న్యాయవాదులకు రక్షణ చట్టం తెస్తాం.
• ల్యాండ్ లైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తాం.
• న్యాయవాదుల సంక్షేమ నిధిని పెంచుతాం.
• నిలిచిపోయిన కోర్టు భవనాల పనులు పూర్తిచేస్తాం.
• సత్వర న్యాయం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను అమల్లోకి తెస్తాం.

Advertisements

You may also like

Our Visitor

014583
Total views : 80513

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.