Monday, July 13, 2026
News Navigation
Monday, July 13, 2026
News Navigation

Breaking

Monday, July 13, 2026
Home Andhra Pradesh పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సీపీఎం ధర్నా

పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సీపీఎం ధర్నా

by Satya
CPM dharna

గుంటూరు జిల్లా మంగళగిరి కార్పొరేషన్ కార్యాలయం వద్ద సీపీఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు ధర్నా నిర్వహించారు. ఎన్నో సంవత్సరాలుగా ఇళ్లు వేసుకొని నివాసం ఉంటున్న పేదలకు ప్రభుత్వం వెంటనే ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేదలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికార యంత్రాంగం, అధికార పార్టీలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. 30 వేల మంది ఇల్లు వేసుకుని నివాసం ఉంటున్నారని, వారిలో పదివేల మందికి మాత్రమే ఇచ్చారన్నారు. మరో 20 వేల మంది ఇళ్ల పట్టాల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Our Visitor

040002
Total views : 202876

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: