Tuesday, April 28, 2026
News Navigation
Tuesday, April 28, 2026
News Navigation

Breaking

Tuesday, April 28, 2026
Home Andhra Pradesh చంద్రబాబు పై శ్రీకాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…

చంద్రబాబు పై శ్రీకాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…

by Prakash
Srikanth Reddy


రాష్ట్రంలో తిరుగులేని మెజారిటీతో గెలవబోతున్నాం – గడికోట శ్రీకాంత్ రెడ్డి (Gadikota Srikanth Reddy)

వైఎస్సార్ సిపికి ప్రజలలో బ్రహ్మాండమైనటువంటి ఆదరణ ఉందని, రాష్ట్రంలో తిరుగులేని మెజారిటీతో గెలవబోతుందని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి (Gadikota Srikanth Reddy) అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి మ్నాదళం శిబ్యాల గ్రామంలో వైఎస్సార్ సిపి ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి రెండవ రోజు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి గడప గడపకు వెళ్లి జగనన్న ప్రభుత్వంలో జరిగిన మంచిన ప్రజలకు వివరిస్తూ ఈ ప్రచారాన్ని కొనసాగించారు. అనంతరం అక్కడే మీడియా సమావేశం వారు ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజలకు చేదోడు వాదోడు గా ఉండేందుకు అనేక వ్యవస్థలను సిఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకువచ్చారని అందుకే ఆయనను గుండెల్లో పెట్టుకొని ప్రజలు పుజిస్తున్నారన్నారు. ఒకటో తేదీ వేస్తే తెల్లవారక ముందే ఇచ్చేటువంటి పెన్షన్ లు చూసి అవ్వ తాతల మోములో ఆనందం కనపడేదన్నారు.

వాలంటీర్ వ్యవస్థ ద్వారా పెన్షన్ పంపిణీ చేయకూడదు..


చంద్రబాబు నాయుడు కొవ్వర్టు నిమ్మగడ్డ ద్వారా కోర్టులో పిటిషన్ దాఖలాలు చేసి వాలంటరీ వ్యవస్థ ద్వారా పెన్షన్లు పంపిణీ చేయకూడదని ఒక ఎన్నికల కమీషనర్ కు ఫిర్యాదు చేయడంతో సేవ చేసే వాలింటర్లు, లబ్దిదారులు నిరుత్సాహంలో ఉన్నారన్నారు. పేదలకు మంచి జరిగేటప్పుడు సంతోష పడాలి కాని ఈర్ష ఉండకూడదన్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయకపోగా మంచి కార్యక్రమాలు చేసే వారిపై కోర్టుకు వెళ్లి స్టేలు తీసుకోవడం చాలా దురదృష్టకరమన్నారు. రాజకీయాలలో లబ్ధి పొందాలను మరొక విధంగా తెలియదు కానీ అనేక విధాలుగా విమర్శించి మాట్లాడడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. పేద ప్రజల విషయాలలో ఎప్పుడూ కూడా రాజకీయాలు చేయకూడదు. అలా చేయడమే చంద్రబాబు నైజం అన్నారు. కోత్తగా మాట్లాడుతున్నారు

మాది బీసీల పార్టీ అని జయహో బీసీలను అంటూ మాట్లాడటం విడ్డూరం…

ఊరురికి ఒక సభను పెడతాం మాది బీసీల పార్టీ అని జయహో బీసీలను అంటూ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. డిప్యూటీ సీఎం నుంచి ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలకు సముచిత ప్రాధాన్యత కల్పించిన ఘనత సిఎం జగన్ మోహన్ రెడ్డికె దక్కుతుందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు బీసీలను ఎంతో చులకనగా మాట్లాడి తోకలు కత్తిరిస్తా అన్న వ్యక్తి ఈ రోజు మిమ్మల్ని ఉద్ధరిస్తా అని మాట్లాడడం సిగ్గుచేటన్నారు. మైనార్టీలను హింసించడమే కాకుండా మోడీ గారితో మనం స్నేహం చేస్తే మోడీ గారు ఈ దేశం నుంచి మైనార్టీలను తరిమేస్తారని లౌకిక వాదం లేదని చెప్పిన వ్యక్తి ఐదు సంవత్సరాలు తిరకముందే ఆయన పోత్తులకు వెళ్లారు..

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం…

ఆయనకు ఎలాగు సిగ్గులేదు ఆయన ప్రోత్సహించి ఓటు అడిగేవారికి సిగ్గులేదుని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడితే ఓట్లు పడవని విమర్శించారు. జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రతి గడపగడపకు వెళ్లి మమేకమై వారి సమస్యలను పరిష్కరించగలిగామన్నారు. ఆర్చులు కట్టి బతుకుతున్నాం అంటున్నారు. ఒకసారి లోపలికి వెళ్లి చూస్తే ఎట్లా ఉంటాయనేది తెలుస్తుందని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో నీరు చెట్టు పనులు చేసిన దోపిడీదారులు కూడా జగన్మోహన్ రెడ్డి బిల్లులు చెల్లించారన్నారు. అలాగే రాప్తాడులో నిర్వహించినటువంటి సిద్ధం సభ ఎరకంగా అయితే వెళ్ళామో అంతకంటే పెద్ద ఎత్తున రేపు మేమంతా సిద్ధం అనే సభకు మదనపల్లిలో జరగబోయే సిద్దం సభకు కూడా ప్రతి ఊరు, ప్రతి పల్లె నుంచి కూడా అందరు కూడా స్వచ్ఛందంగా ప్రహాలు తరలి వచ్చి విజయవంతం చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి సందేశం కోసం ఎదురుచూస్తున్నామన్నారు.

ఇది చదవండి : ఏలూరు లో కిలాడీ డాక్టర్..!


సింగపూర్లో ఏడో రోజు కొనసాగుతున్న ఏపీ మంత్రుల పర్యటన
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా సింగపూర్‌లో జరుగుతున్న ఏపీ మంత్రుల ఉన్నత స్థాయి శిక్షణ కార్యక్రమం …
విశాఖలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనకు సిద్ధం..
విశాఖపట్నంలో భారీ ఐటీ పెట్టుబడులకు మార్గం సుగమం అవుతోంది.ఆనందపురం మండలం తర్లువాడ గ్రామంలో ప్రతిష్టాత్మక గూగుల్ …
గజపతినగరంలో అదుపులేని ఇసుక అక్రమ రవాణా ..
విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా రోజు రోజుకీ తీవ్రమవుతోంది. నదులు, వాగులు …

Follow us on : Google News మరిన్నితాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

008642
Total views : 57022

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.