మంచిర్యాల జిల్లా మందమర్రి బొగ్గు క్షేత్రల వేలం పాటను నిలిపివేసి, సింగరేణి పరిధిలోని బొగ్గు క్షేత్రాలను నామినేషన్ పద్ధతిలో సింగరేణికే కేటాయించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) బ్రాంచి కార్యదర్శి సాలేంద్ర సత్యం డిమాండ్ చేశారు మందమర్రి ఏరియా కెకె 5 గని పై ద్వారా సమావేశంలో ఆయన మాట్లాడుతూ……, నామినేషన్ పద్ధతిలో బొగ్గు బ్లాక్ లను కేటాయించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ), ఏఐటియుసి, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.సింగరేణికి నామినేషన్ పద్ధతిలో బొగ్గు గనులు కేటాయించాలి. జూన్ 5న రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లను ముట్టడించడం జరుగుతుందని, తెలిపారు జూన్ 8 నుండి సింగరేణి ప్రధాన కార్యాలయం, సింగరేణి వ్యాప్తంగా అన్ని జిఎం కార్యాలయాల ఎదుట వారం రోజులపాటు రిలే నిరాహార దీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. 1945లో నిజాం నవాబ్ దక్కన్ కంపెనీని ఏఐటీయూసీ పోరాట ఫలితంగా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ గా ప్రభుత్వ రంగ సంస్థగా ఏర్పాటు చేయడం జరిగిందని, ఆ సమయంలోనే నిజాం నవాబు గోదావరి నది పరివాహక ప్రాంతంలోని బొగ్గు నిక్షేపాలు ఎక్కడ ఉన్న సింగరేణే వెలికి తీయాలని ఒప్పందంలో రాసి ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. అయినప్పటికీ కేంద్రంలో బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం 2015లో తీసుకు వచ్చిన ఎంఎండిఆర్ చట్టంలో బొగ్గు క్షేత్రాలను వేలంపాట ద్వారా ప్రైవేట్ పరం చేసే కుట్రలు చేసిందని ఆరోపించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్పై ఇంగ్లండ్ ఘన విజయం.వావ్! హ్యారీ బ్రూక్ మరియు అతని జట్టు నుంచి ఇది నిజంగా అద్భుతమైన ప్రదర్శన. ఇన్నింగ్స్ మధ్యలో, బంతి పిచ్పై నెమ్మదిగా ఆగుతున్న పరిస్థితుల్లో భారత్కు పోరాడే అవకాశం ఉందా అన్న సందేహం కలిగింది. 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో…
- రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల మంత్రి ,జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, రెవెన్యూ అటవీ అధికారులతో సమావేశం నిర్వహించారు. సోమశిల…
- బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా సందర్శించారు. కేంద్రమంత్రితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్లు ఈ పర్యటనలో పాల్గొన్నారు.…
- యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభోత్సవం.హైదరాబాద్లో ఒలింపిక్ క్రీడలు నిర్వహించాలనేది తన డ్రీమ్ అని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అన్నారు. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్ను భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో కలిసి ఆయన ప్రారంభించారు.…
- ఇరాన్పై అదనపు దాడుల నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.ఇరాన్పై అదనపు దాడులు ముమ్మరమైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఇప్పటికే సైనికంగా విజయం సాధించామని, ప్రస్తుతం ఇరాన్ వద్ద చాలా తక్కువ వనరులు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయన ప్రకటించారు. అమెరికా చర్యలతో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 196857