నేపాల్లో ఘోర ప్రమాదం సంభవించింది. ఓ విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే అదుపుతప్పి నేల కూలిపోయింది. ప్రమాదసమయంలో విమానంలో 17 మంది ప్రయాణికులు ఇద్దరు ఇద్దరు సిబ్బంది ఉన్నారు. విమానం కూలగానే ఒక్కసారిగా చెలరేగిన మంటల్లో చిక్కుకుని పైలట్ మినహా అందరూ దుర్మరణం చెందారు. పోఖరా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ విమానం టూరిస్టులకు సేవలు అందించే సూర్యా ఎయిర్లైన్స్కు చెందినది అని స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే, విమానం కూలేందుకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే విమానం రన్వేను ఢీకొట్టి సమీపంలో కూలిపోయింది. నేపాల్ కుప్పకూలిన విమానం.ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మరాయి.
ఇటీవల కాలంలో నేపాల్లో విమానయాన రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. అయితే, భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, సిబ్బందికి శిక్షణ, నిర్వహణ లోపాలు సమస్యలు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే ఐరోపా సమాఖ్య నేపాల్ విమానాలు తమ గగనతలంలోకి రాకుండా నిషేధం విధించింది. ఇక అత్యంత ఎత్తున, చుట్టూరా కొండల మధ్య ఉండే నేపాల్ విమానాశ్రయాలు, అక్కడి వాతావరణ పరిస్థితులు విమానాల టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో సమస్యలు సృష్టిస్తుంటాయి.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్పై ఇంగ్లండ్ ఘన విజయం.వావ్! హ్యారీ బ్రూక్ మరియు అతని జట్టు నుంచి ఇది నిజంగా అద్భుతమైన ప్రదర్శన. ఇన్నింగ్స్ మధ్యలో, బంతి పిచ్పై నెమ్మదిగా ఆగుతున్న పరిస్థితుల్లో భారత్కు పోరాడే అవకాశం ఉందా అన్న సందేహం కలిగింది. 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో…
- రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల మంత్రి ,జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, రెవెన్యూ అటవీ అధికారులతో సమావేశం నిర్వహించారు. సోమశిల…
- బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా సందర్శించారు. కేంద్రమంత్రితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్లు ఈ పర్యటనలో పాల్గొన్నారు.…
- యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభోత్సవం.హైదరాబాద్లో ఒలింపిక్ క్రీడలు నిర్వహించాలనేది తన డ్రీమ్ అని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అన్నారు. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్ను భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో కలిసి ఆయన ప్రారంభించారు.…
- ఇరాన్పై అదనపు దాడుల నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.ఇరాన్పై అదనపు దాడులు ముమ్మరమైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఇప్పటికే సైనికంగా విజయం సాధించామని, ప్రస్తుతం ఇరాన్ వద్ద చాలా తక్కువ వనరులు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయన ప్రకటించారు. అమెరికా చర్యలతో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 198864