ఏపీ సీఎం చంద్రబాబు శ్రీశైలంలో పర్యటించారు. శ్రీశైలం జలాశయానికి సీఎం చంద్రబాబు జలహారతి ఇచ్చారు. సీఎం పర్యటన సందర్భంగా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ అధిరాజ్ సింగ్ నేతృత్వంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం పర్యటించే ప్రాంతం పూర్తిగా నల్లమల అటవీ ప్రాంతం కావడంతో పోలీసు బలగాలు విస్తృత తనిఖీలు చేపట్టారు. హెలిపాడ్ ప్రాంతంతో పాటు బాబు పర్యటన ప్రాంతాలన్నింటిని డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు చేశారు. శ్రీశైల మల్లిఖార్జున స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆ తర్వాత కుడిగట్టు జల విద్యుత్ కేంద్రాన్ని సందర్శించి.. సున్నిపెంటలోని వాటర్ యూజర్స్ అసోసియేషన్ వారితో ముఖాముఖి చర్చాగోష్టిలో పాల్గొన్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- బొబ్బిలి ఇందిరమ్మ కాలనీలో భూకబ్జాల కలకలం..విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ ఇప్పుడు భూకబ్జాల కేంద్రంగా మారిందన్న ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పేదల కోసం కేటాయించిన ఇళ్ల స్థలాలు బినామీ పేర్లతో కొంతమంది చేతుల్లోకి వెళ్లాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2016 నుంచి…
- క్లాసెన్ మేజిక్, కిషన్ స్థిరతతో SRH ఘన విజయం..సన్రైజర్స్ హైదరాబాద్ చేసిన చేజ్ చాలా బాగా పేస్తో సాగింది. ఇది వారి బ్యాటర్లు సాధారణంగా ఇష్టపడే ఫ్లాట్ పిచ్ కాదు; ఇది రెండు-పేస్ ఉన్న, కొంచెం నెమ్మదిగా ప్రవర్తించిన వికెట్ కావడంతో ఎక్కువ ఓర్పు మరియు నియంత్రణ అవసరమైంది. హెడ్…
- చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేరళం ప్రభుత్వం..దేశంలోనే సరికొత్త రికార్డుకు వేదికైంది కేరళ. ఎప్పుడూ వినూత్న పథకాలు, సామాజిక నిర్ణయాలతో వార్తల్లో నిలిచే కేరళ రాష్ట్రం.. ఇప్పుడు వృద్ధుల కోసం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేస్తూ…
- తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్తతెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన గరిష్ట వయోపరిమితిని మరో పదేళ్ల పాటు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఇందుకు సంబంధించి జీవో…
- రఘునాథ స్వామి ఆలయ భూములపై అక్రమాలు ..రఘునాథ స్వామి ఆలయ భూములపై అక్రమాలు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లి… ఇది సాధారణ గ్రామం కాదు. త్రేతాయుగంలో శ్రీరాముడు సీతా లక్ష్మణులతో కలిసి వనవాసం చేసిన పవిత్ర భూమిగా భక్తులు విశ్వసించే ఆధ్యాత్మిక క్షేత్రం. ఇక్కడ కొలువుదీరిన సీతా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 80752