భారీ వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన తెలుగు రాష్ట్రాల బాధితులను ఆదుకునేందుకు సినీ, రాజకీయ అనే తేడా లేకుండా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తమ వంతు సాయం చేస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏకంగా 6కోట్ల భారీ విరాళంతో ఉదారత చాటారు. ఇందులో తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కు కోటి ప్రకటించిన జనసేనాని.. ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి మరో కోటి ఇచ్చారు. అలాగే ఏపీలో వరద బారిన పడ్డ 400 పంచాయితీలకు లక్ష చొప్పున 4 కోట్లు ప్రకటించారు. ఇలా విపత్కర పరిస్థితుల్లో గొప్ప మనసు చాటిన పవన్పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా వరద ప్రాంత ప్రజల కోసం భారీ విరాళం ప్రకటించిన డిప్యూటీ సీఎంను అభినందించారు. వరదల కారణంగా కష్టాల్లో ఉన్న ప్రజలకు భారీ విరాళం ఇవ్వడం జనసేనాని విశాల హృదయానికి అద్దం పడుతుందని సీఎం కొనియాడారు. తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు జనసేనాని భారీ విరాళం. ప్రజలకు ఆయన చేస్తున్న సేవలకు విలువ కట్టలేమని తెలిపారు. దాతృత్వాన్ని ప్రదర్శించడంలో తనకు తానే సాటిగా ప్రవర్తించే పవన్ కల్యాణ్ సమాజంలో ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు. ప్రజలకు ఆయన చేస్తున్న సేవలకు విలువ కట్టలేం. అదే విధంగా ఆయన కురిపిస్తున్న వాత్సల్యానికి ఏదీ సరితూగదు. ఆయనకు మరో సారి ధన్యవాదాలు తెలుపుతున్నాను అని సీఎం చంద్రబాబు తెలిపారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఎల్ఆర్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనురాగ్ అధర్వ రాజు దర్శకత్వంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన చిత్రం “లఫూట్ గ్యాంగ్”..ఎల్ఆర్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కొండాపూర్ లక్ష్మీకాంత్ రెడ్డి నిర్మాతగా అనురాగ్ అధర్వ రాజు రచనా దర్శకత్వంలో వర్ధన్ మయూర్ కొయ్యాడ సినిమాటోగ్రాఫర్ గా ప్రారంభమైన చిత్రం లఫూట్ గ్యాంగ్. ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధృవన్ ఈ చిత్రానికి సంగీతం…
- ది రెడ్ బ్యాగ్’ చిత్రం నుంచి హీరోయిన్ రాధ్య పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్..డిఫరెంట్ కాన్సెప్ట్, కంటెంట్తో కొత్త నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి, మెమరీ మేకర్స్ బ్యానర్ మీద ‘ది రెడ్ బ్యాగ్’ అనే సినిమాని నిర్మిస్తున్నారు. బ్యాగ్ చుట్టూ తిరిగే ఈ మూవీకి రవి కుమార్ సీరపు కథ, కథనం, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు.…
- రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మరీ జిల్లాలో సంచలనం రేపిన నలుగురి హత్య కేసు..అర్ధరాత్రి వేళ నిర్మానుష్య ప్రాంతంలో మంటల్లో చిక్కుకున్న ఓ కారు… మొదట అది సాధారణ ప్రమాదంగా కనిపించింది. కానీ, కాసేపటికే బయటపడిన నిజాలు పోలీసులను సైతం షాక్కు గురిచేశాయి. రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ జిల్లా సమీపంలో మాజీ సర్పంచ్తో పాటు నలుగురిని…
- పెద్దపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన..పెద్దపల్లి జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర మంత్రుల బృందం పరిశీలించింది. జిల్లాలో పండిన వరి పంట, కొనుగోలు పరిస్థితులపై అధికారులు, రైతులతో నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకుంది. కొనుగోళ్లలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రులు, అనంతరం…
- సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పు..భారత అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. తీర్పుల వెల్లడిలో జరుగుతున్న ఆలస్యాన్ని అరికట్టేందుకు రాజ్యాంగం ఇచ్చిన అధికారాన్ని ప్రయోగించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద తనకు సంక్రమించిన అసాధారణ అధికారాలను ఉపయోగించి, దేశంలోని అన్ని హైకోర్టులకు ఖచ్చితంగా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 89129