Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home National వయోవృదులందరికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమా

వయోవృదులందరికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమా

by Satya
వయోవృదులందరికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమా

దేశంలో ఉన్న 70 ఏళ్లు పైబడిన వయోవృదులందరికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమా పథకాన్ని వర్తింపజేయాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్‌లకు లబ్ది చేకూరుతుంది. వీరందరికీ రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్స లభిస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ముగిసిన ఈ పథకం స్థానంలో కొత్తగా ఎలక్ట్రిక్ వాహనాల – EV వినియోగం, విక్రయాలను పెంచేందుకు రెండేళ్లకు 10 వేల 900 కోట్లతో పీఎం ఈ-డ్రైవ్ స్కీమ్‌ను మంత్రివర్గం ఆమోదించింది. ఇక, ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన పథకానికి సంబంధించి నాలుగో దశను ఆమోదించింది. దీని ద్వారా ప్రధానంగా గ్రామీణ రహదారుల కోసం 70 వేల 125 కోట్లను ఖర్చు చేయనుంది. మొత్తం 62 వేల 500 కిలోమీటర్ల గ్రామీణ రహదారులను నిర్మించేందుకు కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

019145
Total views : 89978

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.