Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home Telangana మంత్రి వస్తేనే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

మంత్రి వస్తేనే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

by Rama
మంత్రి వస్తేనే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంత్రి వస్తేనే పంపిణీ చేస్తామని అధికారులు చెబుతూ లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేయడం ఆనవాయితీ కానీ మంత్రి వస్తేనే పంపిణీ చేస్తామని అధికారులు పేర్కొనడం సరికాదని ఎమ్మెల్యే కృష్ణారావు అన్నారు. చెక్కులు నిలిపివేయడంతో లబ్ధిదారులు తన ఇంటి చుట్టూ తిరుగుతున్నారన్నారు. కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓలకు పలుసార్లు ఫోన్ చేస్తే మంత్రి చేతుల మీదుగానే పంపిణీ చేస్తామంటున్నారని అన్నారు. తన చేతుల మీదుగా పంపిణీ చేయడం ఇబ్బంది అయితే అధికారులే పంపిణీ చేయాలని సూచించారు. కూకట్ పల్లి నియోజకవర్గంలో నెల రోజులుగా 550 మంది లబ్ధిదారుల చెక్కులను నిలిపివేశారన్నారు. వెంటనే లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయకపోతే మంగళవారం ఉదయం ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తామని ఎమ్మెల్యే కృష్ణారావు హెచ్చరించారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • తమిళనాడు సీఎం విజయ్ పాలనపై స్టాలిన్ ఫైర్.
    తమిళనాడు రాజకీయాల్లో అధికార, విపక్షాల మధ్య విమర్శలు మరింత తీవ్రంగా మారుతున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌పై డీఎంకే నేత స్టాలిన్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అసెంబ్లీని సినిమాలు తీసే ప్రదేశంగా మార్చేశారని ఆరోపించారు. పరిపాలనను కూడా సినిమా షూటింగ్‌లా నడుపుతున్నారని ఎద్దేవా…
  • ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్‌తో జేఏసీ భేటీ.
    ప్రభుత్వం ఆహ్వానం మేరకు ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు జేఏసీ ప్రతినిధులు సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. క్షేత్రస్థాయిలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, పెరుగుతున్న పని ఒత్తిడి, ఉద్యోగ సంఘాల నాయకులపై ఒత్తిడి వంటి అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా ఆరు…
  • ప్రతిపక్షాల తీరుపై మంత్రి శ్రీధర్‌బాబు ఫైర్.
    శాసనమండలిలో ప్రతిపక్షాల తీరుపై మంత్రి శ్రీధర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రతి ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం ఇస్తోందని స్పష్టం చేశారు. భూముల కేటాయింపుల విషయంలోనూ పూర్తి వివరాలతో సమాధానాలు ఇస్తున్నామని…
  • తెలంగాణ అసెంబ్లీలో కంటిన్యూ అవుతున్న రచ్చ.
    తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నాలుగో రోజు కూడా వాడీవేడిగానే సాగింది. మైక్ ఎవరిదైనా.. మాటల తూటాలు మాత్రం పేలుతూనే ఉన్నాయి. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌, 22ఏ భూముల వివాదం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రతిపక్షాల ఆందోళనతో సభ రాజకీయ రణరంగంగా మారింది.…
  • త్వరలో పాదయాత్ర చేయబోతున్నట్లు వైసీపీ అధినేత జగన్ ప్రకటన.
    త్వరలో పాదయాత్ర చేయబోతున్నట్లు వైసీపీ అధినేత జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే టీడీపీ నేత రియాక్షన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు మంచితనాన్ని చూసి గతంలో జగన్ పాదయాత్ర చేశారని, కానీ ఇప్పుడు అలా కుదరని…

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: