తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రజాప్రతినిధులు, అధికారుల సిఫారసు లేఖలపై ఇచ్చే టికెట్లను టిటీడీ నిశితంగా పరిశీలిస్తోంది. దుర్వినియోగానికి పాల్పడుతున్నవారిపై నిఘా పెట్టింది. సిఫారసు లేఖల్ని ఇష్టానుసారం వినియోగించడంలో అధికార, ప్రతిపక్షాలనే తేడా లేకుండా ఉందని అధికారులు గుర్తించారు. దుర్వినియోగానికి పాల్పడుతున్న ప్రజాప్రతినిధుల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. ఇందులో ఒకరిద్దరు మంత్రులూ ఉన్నట్లు సమాచారం. ఈ జాబితాను త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమర్పించి ఆయన ఆదేశాలకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు.
వైసీపీ హయాంలో వీఐపీ బ్రేక్, శ్రీవాణి దర్శనాల్లో భారీగా అవకతవకలు చోటుచేసుకున్నాయి. కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు సెల్ఫ్ సిఫారసు లేఖలను టీటీడీ సమర్పించి… తమవెంట 50 నుంచి 100 మందిని తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. దీనిని కట్టడి చేస్తే… శ్రీవారిని దర్శించుకునేందుకు సామాన్యభక్తులకు అదనంగా మరో గంట సమయాన్ని అందుబాటులోకి తేవొచ్చని టీటీడీ భావిస్తోంది.
మరోవైపు ప్రతినెలా ఖాళీగా ఉన్న ఆర్జిత సేవల టికెట్లను ఆన్లైన్లో విడుదల చేసి డిప్ ద్వారా టీటీడీ కేటాయిస్తుంది. ఒక్కసారి ఆర్జితసేవ టికెట్ పొందిన భక్తుడికి మళ్లీ మూడు నెలల తర్వాతే దర్శనానికి అవకాశం ఉంటుంది. ఇలా సామాన్య భక్తులకు ఒక రీతి… వీఐపీలకు మరో రీతి ఉండటంపై భక్తులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- కెనడాపై ట్రంప్ సంచలన నిర్ణయం.కెనడా నుంచి దిగుమతి అయ్యే కార్లు, ట్రక్కులు, ఆటోమొబైల్ విడిభాగాలు, స్టీల్పై 50 శాతం భారీ దిగుమతి సుంకాలు విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ కొత్త టారిఫ్లు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు.…
- అమెరికా వెళ్లే భారతీయ ఉద్యోగులకు భారీ షాక్.అమెరికాలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు ట్రంప్ ప్రభుత్వం భారీ షాక్ ఇవ్వనుంది. H-1B వీసాపై లక్షా 3 వేల డాలర్ల వరకు ఫీజు విధించే ప్రతిపాదనలను తీసుకొచ్చింది. కోర్టులు గతంలో కొన్ని చర్యలను అడ్డుకున్నప్పటికీ, వీసా విధానాల్లో కఠిన మార్పుల…
- శ్రీరంగంపట్నంలోని ఆలయంలో ఎంట్రీ విషయంలో వివాదం.శ్రీరంగపట్నంలోని ఆరతి ఉక్కడ ఆలయంలో ఎమ్మెల్యే కుమార్తె, పోలీసు సబ్ఇన్స్పెక్టర్ మధ్య ఘర్షణ సంచలనంగా మారింది. మహిళా పీఎస్ఐ, ఎమ్మెల్యే కుమార్తె ఒకరినొకరు చెంపదెబ్బలు కొట్టుకోవడం తీవ్ర కలకలం రేపింది. భీమ అమావాస్య వేడుకల సందర్భంగా ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించే విషయంలో…
- ‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి.‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ: ఇరుముడి బ్లాక్బస్టర్ ప్రెస్మీట్లో మాస్ మహారాజా రవితేజ మాస్ మహారాజా రవితేజ హార్ట్ విన్నింగ్ బ్లాక్బస్టర్ ‘ఇరుముడి’. శివ నిర్వాణ…
- AE నూకరాజు ఫ్యామిలీ మృతి కేసులో కీలక పరిణామం.కాకినాడలో ఏఈ నూకరాజు కుటుంబం మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కుటుంబం ఆత్మహత్యకు ముందు సౌజన్య రాసినట్లు చెబుతున్న ఐదు పేజీల చివరి లేఖ వెలుగులోకి వచ్చింది. ఆ లేఖలో నిందితుడు షేక్ సాదిక్పై ఆమె చేసిన ఆరోపణలు కలచివేస్తున్నాయి.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి