అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు, ఇంధన ధరల మంటల కారణంగా గత వారం దేశీయ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. గత వారం రోజుల్లో సెన్సెక్స్ 2.70 శాతం, నిఫ్టీ 2.20 శాతం మేర పతనమయ్యాయి. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 75 వేల 237 పాయింట్ల వద్ద, నిఫ్టీ 23 వేల 643 వద్ద స్థిరపడ్డాయి. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, అమెరికా-ఇరాన్ వివాదం, రూపాయి విలువ అత్యంత కనిష్టానికి పతనమవడంతో మార్కెట్ తీవ్ర హెచ్చుతగ్గులకు గురైంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర అంతకంతకూ పెరుగుతుండటం మార్కెట్లలో ఆందోళన పెంచింది. ఐతే రెండ్రోజుల తర్వాత ఇవాళ ప్రారంభమవుతున్న మార్కెట్కు కొన్ని సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయంటున్నారు నిపుణులు. ఎన్ఎస్ఈ ఇంటర్నేషనల్ ఎక్స్ఛేంజ్లో నిఫ్టీ ఫ్యూచర్స్ 61 పాయింట్ల లాభంతో 23 వేల 769 వద్ద ట్రేడవుతుండటం మార్కెట్ పాజిటివ్గా ఓపెన్ అయ్యే అవకాశాలను సూచిస్తోంది. డాలర్తో రూపాయి విలువ 96.05 వద్ద ట్రేడవుతోంది. రూపాయి ఇంత తక్కువ స్థాయికి పడిపోవడం ఇదే మొదటిసారి. చమరు ధరల పెరుగుదల, విదేశీ ద్రవ్యం అధికం కావడం, పశ్చిమాసియాలో అస్థిరత వంటివి రూపాయి పతనానికి కారణాలుగా ఉన్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లపై పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం..
174
previous post





Total views : 201207