తమిళనాడులో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కే. అన్నామలై పార్టీని వీడుతూ రాజీనామా లేఖను జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరికు సమర్పించారు. ఐదు పేజీల సుదీర్ఘ లేఖలో ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తును వ్యతిరేకించడం మరియు పార్టీపై తన అసంతృప్తి వ్యక్తం చేశారు. తమిళనాడులో పార్టీ రాజకీయ వ్యూహంపై అన్నామలైకి, బీజేపీ కేంద్ర నాయకత్వానికి కొన్నాళ్లు నెలకొన్న విభేదాల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. అన్నాడీఎంకే పొత్తును పునరుద్ధరించడం, అసెంబ్లీ ఎన్నికలకు ముందు అభ్యర్థుల ఎంపిక సహా అంశాలపైనా బీజేపీపై అన్నామలై అసంతృప్తిగా ఉన్నారని వర్గాలు తెలిపాయి.
పొత్తులపై ఆధారపడటం కంటే రాష్ట్రంలో ఒక స్వతంత్ర సంస్థాగత పునాదిని నిర్మించుకోవడంపై బీజేపీ దృష్టి పెట్టాలని అన్నామలై వాదించినట్లు తెలుస్తోంది. కానీ, జాతీయ నాయకత్వం విస్తృతమైన డీఎంకే వ్యతిరేక వ్యూహానికి ప్రాధాన్యత ఇచ్చిందని సమాచారం. ఎన్నికల్లో దళపతి విజయ్ నాయకత్వంలోని టీవీకే పనితీరు తమిళ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసిందని, కొత్త రాజకీయ శక్తులకు ఆస్కారం కల్పించాయని ఆయన సహచరులు పేర్కొంటున్నారు.
రాజీనామా లేఖను బీజేపీ చీఫ్ నితిన్ నబీన్కు అందజేసిన అన్నామలై..
33
previous post



Total views : 92042