Thursday, March 12, 2026
News Navigation

Breaking

Thursday, March 12, 2026
Home Telangana హన్మకొండ జిల్లాలో కలకలం రేపుతున్న వరుస చోరీలు

హన్మకొండ జిల్లాలో కలకలం రేపుతున్న వరుస చోరీలు

by Satya
హన్మకొండ జిల్లాలో కలకలం రేపుతున్న వరుస చోరీలు

హన్మకొండ జిల్లాలో కలకలం రేపుతున్న వరుస చోరీలు . పలు కాలనీల్లో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి వేళల్లో ఇండ్లలోకి చొరబడడం స్థానికంగా కలకలం రేపుతోంది. భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ లోని శ్రీనివాస్ నగర్ లో మహిళలు రాత్రంతా భయంతో నిద్రపోకుండా ఇండ్ల ఎదుట కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. పురుషులంతా కర్రలతో కాలనీలో తిరుగుతూ గస్తీలు కాస్తున్నారు. హిందీ భాష మాట్లాడుతున్న కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాత్రిపూట ఇళ్లల్లోకి చొరబడి బెదిరించారని పలువురు కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇండ్లలోకి వచ్చి బెదిరిస్తున్న సమయంలో చుట్టుపక్కల కాలనీవాసులు అప్రమత్తమై కేకలు వేస్తూ వారిని పట్టుకోవడానికి ప్రయత్నించడంతో పరారయ్యారన్నారు. మధ్యాహ్నం వేళ కాలనీల్లో సంచరిస్తూ తాళం వేసిన ఇండ్లను లక్ష్యంగా చేసుకుంటున్నరన్నారు. గ్రామంలోని పశువుల ఆస్పత్రి, చేపల మార్కెట్ లను రాత్రివేళ స్థావరాలుగా చేసుకొని పక్కా ప్రణాళికతో దొంగతనాలకు పాల్పడుతున్నారని తెలిపారు. గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తుల సంచారాన్ని పోలీసులు కట్టడి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.