హన్మకొండ జిల్లాలో కలకలం రేపుతున్న వరుస చోరీలు . పలు కాలనీల్లో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి వేళల్లో ఇండ్లలోకి చొరబడడం స్థానికంగా కలకలం రేపుతోంది. భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ లోని శ్రీనివాస్ నగర్ లో మహిళలు రాత్రంతా భయంతో నిద్రపోకుండా ఇండ్ల ఎదుట కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. పురుషులంతా కర్రలతో కాలనీలో తిరుగుతూ గస్తీలు కాస్తున్నారు. హిందీ భాష మాట్లాడుతున్న కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాత్రిపూట ఇళ్లల్లోకి చొరబడి బెదిరించారని పలువురు కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇండ్లలోకి వచ్చి బెదిరిస్తున్న సమయంలో చుట్టుపక్కల కాలనీవాసులు అప్రమత్తమై కేకలు వేస్తూ వారిని పట్టుకోవడానికి ప్రయత్నించడంతో పరారయ్యారన్నారు. మధ్యాహ్నం వేళ కాలనీల్లో సంచరిస్తూ తాళం వేసిన ఇండ్లను లక్ష్యంగా చేసుకుంటున్నరన్నారు. గ్రామంలోని పశువుల ఆస్పత్రి, చేపల మార్కెట్ లను రాత్రివేళ స్థావరాలుగా చేసుకొని పక్కా ప్రణాళికతో దొంగతనాలకు పాల్పడుతున్నారని తెలిపారు. గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తుల సంచారాన్ని పోలీసులు కట్టడి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- జమ్ము మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం..జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా పై హత్యాయత్నం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం సురీందర్ తో కలిసి ఓ పెళ్లి వేడుకకు వెళ్లారు మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా. ఈ సందర్భంగా ఫరూఖ్ అబ్దుల్లాకు భారీ భద్రత ఉంది.…
- ఆర్ అండ్ బీ అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష .రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధిని దీర్ఘకాలిక దృష్టితో ముందుకు తీసుకెళ్లాలని, 2047 విజన్ డాక్యుమెంట్కు అనుగుణంగా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. హైదరాబాద్ నగరం నుంచి రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా నిర్ణీత సమయంలో చేరుకునేలా రోడ్ల అభివృద్ధి…
- ఫుడ్స్ పెట్టలేమంటూ హైదరాబాద్ ఐటీ కారిడార్ హాస్టల్ యాజమాన్యాలు సర్క్యులర్ జారీ చేశాయి.పశ్చిమాసియా యుద్ధ సెగ ఐటీ ఉద్యోగులకు తగిలింది. ఫుడ్స్ పెట్టలేమంటూ హైదరాబాద్ ఐటీ కారిడార్ హాస్టల్ యాజమాన్యాలు సర్క్యులర్ జారీ చేశాయి. ఎల్పీజీ గ్యాస్ కొరత కారణంగా హైదరాబాద్ హాస్టల్ యాజమాన్యాలు ఈ నిర్ణయం తీసుకున్నాయని తెలిపాయి. కేవలం ముఖ్యమైన ఆహార…
- పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, గల్ఫ్ దేశాల్లో ఉన్న లక్షలాది మంది భారతీయుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, గల్ఫ్ దేశాల్లో ఉన్న లక్షలాది మంది భారతీయుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారత ప్రభుత్వం ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ పార్లమెంటులో వెల్లడించిన సమాచారం ప్రకారం,…
- సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరిగింది.సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సీఎం వారికి పలు అంశాలపై లక్ష్యాలను నిర్దేశించారు. సంక్షేమ, అభివృద్ధిపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. అధికారులు-ప్రజాప్రతినిధుల…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి