మహా కుంభమేళాని తలపించేలా గోదావరి ప్రదక్షణ కార్యక్రమం నరసాపురంలో నిర్వహించబోతున్నట్లు నరసాపురం విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు యావత్ భారతదేశం నుండి 300 మంది స్వామీజీలు పీఠాధిపతులు వస్తున్నారని శుక్రవారం సాయంత్రం నరసాపురంలో గోదావరి కి హారతి కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా బంధువులు హిందూ సోదర సోదరీమణులు భారీగా తరలిరావాలని వారు కోరారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నరసాపురం ను ఒక పుణ్య ప్రదేశంగా చేసేందుకు గోదావరి ప్రారంభమైన నాసిక్ నుండి గోదావరి నది సముద్రంలో కలిసే ప్రాంతం అంతర్వేది వరకు పాదయాత్రగా వచ్చిన స్వామీజీలు పీఠాధిపతులు నరసాపురం పట్టణంలో 108 కలశలతో భారీ ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని అనంతరం గోదావరి కి స్వామీజీలు పిఠాధిపతులు హారతి ఇస్తారన్నారు.
గోదావరి ప్రదక్షిణ కార్యక్రమం
327
previous post




Total views : 61670