జనసేన అధినేత పవన్ కల్యాణ్ సెన్స్ బుల్ పర్సన్ కాదు అంటూ మంత్రి సీదిరి అప్పలరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా ఆయనకు స్థిరత్వం లేదన్నారు. పూటకో మాట రోజుకో నాటకంలా.. ఆయన వ్యవహరించడం ప్రజలంతా చూస్తున్నారన్నారు. చంద్రబాబు హయాంలో ఆనాడు ఐవైఆర్ కృష్ణారావు రచించిన ‘ఎవరి రాజధాని అమరావతి..?’ పుస్తకాన్ని ఆవిష్కరించింది పవన్ కల్యాణ్ కాదా..? గూగుల్లో వెదికితే అసలు నిజం తెలుస్తోందన్నారు. ఈరోజు అదే అమరావతి పవన్ కల్యాణ్కు ముచ్చటైన వేదికగా కనిపిస్తుందా..? అని నిలదీశారు. గతంలో చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని ఆయన్ను ముఖ్యమంత్రిగా చేసినప్పుడు.. ఆయన చేసిన పాపాలే ఇప్పుడు పవన్ కల్యాణ్నూ చుట్టుముడుతున్నాయని చెప్పుకొచ్చారు. నేడు చంద్రబాబు మీద ఈగ వాలనీయకుండా.. సొంతకొడుక్కి లేని నొప్పి పవన్ కల్యాణ్కి కలుగుతుంది కనుకే ఆయన్ను దత్తపుత్రుడు అని తాము అంటున్నట్లు చెప్పుకొచ్చారు. జనసేన పార్టీని పవన్ కల్యాణ్ అమ్మేశాడని ఆ పార్టీ కార్యకర్తలు గుర్తించాలి అని మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు.
Guntur
రాష్ట్రంలోని నగరాలన్నింటిలో ఆహ్లాదకరమైన పార్క్ లను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని ఏపీ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గుంటూరులో ఎంపి అయోధ్య రామిరెడ్డి, ప్రభుత్వ విప్ లేళ్ళ అప్పిరెడ్డి, తదితర ముఖ్య నేతలతో కలిసి రూ.6.25 కోట్లతో అభివృద్ధి చేసిన నగరపాలక సంస్థ గాంధీ పార్క్ ను పునః ప్రారంభం చేశారు.
ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మానసిక ఒత్తిడి, వాతావరణ కాలుష్యం నుండి పచ్చదనం ప్రశాంతతని అందించడంలో పార్క్ లు ప్రధాన పాత్ర పోషిస్తాయని, గాంధీ పార్క్ అభివృద్ధి ద్వారా గుంటూరు నగర ప్రజలకు ఆహ్లాదం అందేలా నగరపాలక సంస్థ చర్యలు తీసుకుందన్నారు. మారుతున్న ప్రస్తుత కాలానికి తగిన విధంగా పిల్లలకు ఎడ్యుకేటివ్ గా పార్క్ ని తీర్చిదిద్దారన్నారు.
పవన్ కళ్యాణ్ పై మరోసారి విరుచుకుపడ్డ మంత్రి అంబటి…పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ సీఎం,సీఎం అని అంటుంటే పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు సీఎం, చంద్రబాబు సీఎం అంటున్నాడు. ఎందుకంటే పవన్ కి క్యాష్ కొడితే వెళ్ళిపోతాడు.పవన్ కళ్యాణ్కు రాజకీయాలు తెలియవు. అతను రాజకీయాలకు పనికిరాడు. అతను నమ్మి వెళితే కుక్కతోక పట్టుకొని గోదారి వీధినట్టే… జగనే ఎందుకు మళ్ళీ సీఎం కావాలంటే,
సంక్షేమ కార్యక్రమాలు అమలు కోసం జగన్ రావాలన్నారు
శుక్రవారం స్థానిక టిడిపి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేను బాగుంటే చాలు, నా పార్టీ ఎమ్మెల్యేలు దోచుకుంటే చాలని జగన్ రెడ్డి నాలుగు నరేల్లగా అవినీతి అక్రమాలు చేస్తూ ప్రజలకు ఒక్క మంచి పని కూడా చేయలేదని ఆయన పెద్దేవా చేశారు. జాబ్ క్యాలెండర్ ఇస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన జగన్ రెడ్డి రాష్ట్రంలో యువత జీవితాన్ని నాశనం చేశారని విమర్శించారు. టిడిపి పాలనలో సమాజం బాగుండాలని చంద్రబాబు నాయుడు ఆలోచించి యువతకు పెద్దపీట వేస్తూ 6.50 లక్షల ఉద్యోగాలు కల్పించి ఆదుకోవడం జరిగిందన్నారు. రాష్ట్రంలో సాగుతున్న అరాచక పాలనను చూసి ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాయని అన్నారు. రాష్ట్రానికి భవిష్యత్తునివ్వటం చేతగాని అసమర్ధ సీఎం జగన్ రెడ్డి గజ దోపిడీ చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన గుంటూరు మిర్చి యార్డును కేంద్ర కార్మిక శాఖ చైర్మన్ వల్లూరి జయప్రకాష్ నారయణ సందర్శించారు. మిర్చి యార్డులోని కార్మికులను పరామర్శించి వారి సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. కార్మికులుగా వారికి రావలసిన మౌలిక వసతులు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. ఈ నేపథ్యంలో మిర్చి యార్డు బోర్డు నభ్యులు, అధికారులు… కార్మికుల పట్ల చిన్న చూపు చూస్తే ఉపేక్షించేది లేదన్నారు. కార్మికులకు కనీసం మంచినీటి సౌకర్యం కానీ, మహిళా కార్మికులకు బాత్రూం సౌకర్యాలు కానీ లేకపోవడం పట్ల మండిపడ్డారు. కార్మికులను మిర్చి యార్డ్ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణకు మధ్య వివాదాలు ఉన్న నేపథ్యంలో వివాదాలు పరిష్కరించాలని కోరారు. కార్మికుల సమస్యల పట్ల తక్షణమే స్పందించి వారికి తగు సదుపాయాలు కల్పించాలి అని అన్నారు. లేనిపక్షంలో భారతీయ జనతా పార్టీ తరపున ఆందోళన చేపడుతామని జయ ప్రకాష్ నారాయణ హెచ్చరించారు.
పల్నాడు జిల్లా, వినుకొండ వినాయక ఫైర్ వర్క్స్ గౌడౌన్ లో తనిఖీలు నిర్వహించిన పోలిసులు వ్యాపార లైసెన్సు, ఫైర్ లైసెన్సు, ఫైర్ పరికరాలు పరిశీలించిన సిఐ సాంబశివరావు క్రాకర్స్ అధిక ధరలకు అమ్ముతున్నట్లు ఫిర్యాదులు వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి సమిపంలో ఉన్న వినాయక క్రాకర్స్ గౌడౌన్ ను సిఐ సాంబశివరావు సిబ్బంది తో కలసి పరిశీలించారు… వ్యాపారానికి సంబంధించిన అనుమతి పత్రాలను, ఫైర్ లైసెన్సు, నిల్వ సామర్థ్యంను పరిశీలించారు… అగ్నిమాపక పరికరాలను పనిచేస్తున్నాయా…లేదా అని సిబ్బందిని అడిగి తెలుసుకుని వారికి పలు సూచనలు చేశారు…ఈ సందర్భంగా సిఐ సాంబశివరావు మీడియా తో మాట్లాడుతూ క్రాకర్స్ అమ్ము కోవలనుకునే వారికి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాత్కాలిక లైసెన్సు లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. వ్యాపారులు అందరూ జూనియర్ కళాశాల మైదానంలో అమ్ముకునే విధంగా అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు… కొందరు వ్యాపారులు స్టాండర్డ్ కాని దీపావళి మందులను అధిక ధరలకు అమ్ముతున్నారని ఫిర్యాదు లు వస్తున్నాయని తెలిపారు… వ్యాపారులు అందరూ ప్రభుత్వ నియమ నిబంధనలతో ఏవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వ్యాపారం నిర్వహించుకోవాలని కోరారు.
పల్నాడు జిల్లా… రాజుపాలెం మండలం రెడ్డిగూడెం గ్రామంలో పవన్ వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో పాల్గొన్న జలవనరుల శాఖ మంత్రి రాంబాబు. పవన్ కళ్యాణ్ పై అంబటి ఘాటు కామెంట్స్ మా వాళ్లు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలనుకుంటారు. పవన్ కళ్యాణ్ సూట్ కేసులు క్యాష్ తీసుకొని చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలనుకుంటాడు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నం చేసే నీచమైనటువంటి రాజకీయాలు చేసే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి వచ్చిన వారిని మళ్ళా ఇంటికి పంపిస్తారు ఈ రాష్ట్ర ప్రజానీకం. పవన్ కళ్యాణ్ తెలంగాణలో బిజెపికి సపోర్ట్ చేస్తారంట. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో జెండా ఎత్తేశారు. పవన్ అక్కడ భారతీయ జనతా పార్టీ మోడీకి, ఇక్కడేమో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తారు. అక్కడ అలా ఇక్కడ ఇలా ఏమిటో ఎవరికి అర్థం కాదు. ఏప్పుడు ఎక్కడ ఎలా ఉంటాడో తెలియని వ్యక్తి పవన్ కళ్యాణ్. కమ్యూనిస్టులే నిజమైన దేశభక్తులను ఎన్టీ రామారావు పవన్ కళ్యాణ్ చెప్పారు. నావల్ల నా ప్రభుత్వం వల్ల మేలు జరిగితే ఓటెయ్యండి.
అని అడిగిన మొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ప్రతి ఇంటికి ద్రోహం చేసిన వ్యక్తులు పవన్ కళ్యాణ్ చంద్రబాబు. ఉద్యోగాలు ఇస్తానని, ఋణ మాఫీ చేస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేశారు. వైసీపీ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలు దేశానికి దార్శనియంగా ఉన్నాయన్నారు. అందరూ సమిష్టిగా పనిచేసి జగన్ మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు మంత్రి అంబటి.
పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని స్థానిక 20 వ వార్డ్ లో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ చదలవాడ అరవింద బాబు ఇంటింటికి తిరిగి వైసీపీ ప్రభుత్వ పాలనలో సామాన్య ప్రజలు పడుతున్న బాధలను కష్టాలను అడిగి తెలుసుకొని వారి అభిప్రాయాలను నమోదు చేసుకున్నారు. చదలవాడ అరవింద్ బాబు కామెంట్స్…. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నీతి నిజాయితీగల మనిషి అని. యువతకి రైతులకి మంచి భవిష్యత్తు కావాలి అంటే అది బాబు వల్లే అవుతుందని అన్నారు.. నాలుగున్నరేళ్ల జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి లేదు,సంక్షేమం లేదు,ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయని అన్నారు.. టిడిపి మేనిఫెస్టో ద్వారా చంద్రబాబు నాయుడు ప్రజలకు అనేక హామీలు ఇవ్వడం జరిగిందన్నారు…మహిళల కోసం మహాశక్తి కార్యక్రమం తెస్తామని,ఇంట్లో ఎంతమంది మహిళలు అంటే అంతమందికి ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మహిళలు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
పల్నాడు జిల్లా నరసరావుపేట ఇక్కుర్తికొండ వద్ద అనుమానాస్పద రీతిలో వ్యక్తి మృతదేహం లభ్యం. పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు. ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టిన రూరల్ పోలీసులు మృతుడు ఇక్కుర్తి గ్రామం గోపనబోయిన వెంకటేశ్వర్లుగా గుర్తింపు చేసారు. నరసరావుపేట లోని ఓప్రైవేట్ ఆసుపత్రిలో వార్డ్ బాయ్ గా పనిచేస్తున్న మృతుడు వెంకటేశ్వర్లు. సోమవారం నుండి వెంకటేశ్వర్లు అదృశ్యమైనట్లు మృతుని తల్లిదండ్రులు వెల్లడి. మృతుడు వెంకటేశ్వర్లు మరణించి సుమారు మూడు రోజులు అయ్యి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు మృతుడి మరణం ప్రథమశాత్తు జరిగిందా, ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బాపట్ల పట్టణంలోని బేతనీ కాలనీ ఒకటవ వార్డు బాపట్ల మండలం మూలపాలెం గ్రామంలో కర్లపాలెం మండలం m.v. రాజుపాలెంలో బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి ఆంధ్రప్రదేశ్ కు జగన్ ఎందుకు కావాలంటే అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలంటే అనే కార్యక్రమమును ఈ నెల 9వ తారీకు నుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో జరిగిన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి ఫలాలు గురించి ప్రజల్లోకి తీసుకు వెళ్ళటానికి ఈరోజు మేము మీ వార్డులోకి గ్రామాల్లోకి వస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గత నాలుగు సంవత్సరాల ఏడు నెలల కాలంలో ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానాల్లో 98% పూర్తి చేసిన ఘనత జగన్ కి దక్కుతుందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలను నెరవేర్చడంలో వెనుకాడబోరని రానున్న ఆరు నెలల కాలంలో మిగిలిన హామీలను నెరవేర్చే విధంగా వైసీపీ ప్రభుత్వం కృషి చేస్తుందని కోన రఘుపతి అన్నారు.
Read Also..






Total views : 75414