అక్రమ గంజాయి క్రయ, విక్రయాలు రవాణాపై వరుసగా కొరడా ఝలిపిస్తున్న సెబ్ అధికారులు. అక్రమ గంజాయి రవాణా చేసే ఐదుగురు ముద్దాయిలను అరెస్ట్ చేశారు. 95 వేల రూపాయల నగదు,40 కేజీల గంజాయి,5 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ కాబడిన ముద్దాయిలను మీడియా ముందు ప్రవేశపెట్టారని సెబ్ ఏయస్పీ హిమవతి వివరాలను వెల్లడించారు. మాదకద్రవ్యాల రహిత నెల్లూరు జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ప్రజలు మాదకద్రవ్యాల పట్ల జాగ్రత్త వహించాలని సెబ్ ఏయస్పీ హిమవతి సూచించారు.
Neloore
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో వరదాపురం గ్రామంలోని శ్రీ సాయినాథ్ హైస్కూల్ లో తొమ్మిదవ తరగతి విద్యార్థి ఉల్లిపాయల నందకిషోర్ మిస్సింగ్. ఆల్తుర్తి గ్రామానికి చెందిన నందకిషోర్ పాఠశాల యాజమాన్యం నిర్వహిస్తున్న హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాడు. మంగళవారం సాయంత్రం నుంచి కనబడకుండా పోయాడు. నందకిషోర్ మిస్సింగ్ విషయమై పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్య సమాధానం. తల్లిదండ్రులు ఆందోళనతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న స్కూల్ ముందు తల్లిదండ్రులు, బంధువుల నిరసనకు దిగారు.
నిధులు కేటాయించకుండానే విధులు కేటాయించే దౌర్భాగ్య పరిస్థితులు ఏపీలో దాపురించాయని మాజీ మంత్రి, వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా సమగ్రాభివృద్ధిపై చర్చాగోష్ఠి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, ఆ పార్టీ నేతల దోపిడీ విధానాలను వివరిస్తూ..తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నదుల అనుసంధానంతో..నీటిని మరొకప్రాంతానికి తరలించుకునే అవకాశం ఉన్నప్పటికీ..ప్రాజెక్టులు పూర్తికాకపోవడంతో ఏడాదికి మూడు వేల టీఎంసీల నీరు సముద్రం పాలవుతుందన్నారు. కృష్ణా-పెన్నా నదుల అనుసంధానం పూర్తయినా..నీటిని తెచ్చే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం ఏ కోశానా చేయడంలేదన్నారు.జిల్లాలోని మెట్టప్రాంతాలు నీటి కోసం వేడుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. వైకాపా పాలనలో రైతుల గోడును తీర్చే నాధుడే కరువయ్యాడని మండిపడ్డారు.కొసమెరుపుగా మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ పై సెటైర్స్ వేశారు. సైదాపురం అక్రమ మైనింగ్ అంతా టిడిపి నేతలదే అని వ్యాఖ్యానించిన మాజీ మంత్రి అనీల్ యాదవ్ తాను కూడా తన మనుషుల ద్వారా అక్రమ మైనింగ్ త్రవ్వకాలు జరిపినది వాస్తవం కాదా అంటూ ప్రశ్నించారు
నెల్లూరు జిల్లా రాపూరు మండలం తెగచర్ల గ్రామ సమీపంలో అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్న 17 ఎర్ర చందనం దుంగలు, కారు,రెండు బైకులు,తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు రాపూరు అటవీ శాఖ రేంజర్ రవీంద్రబాబు తెలిపారు.ఆయన మాట్లాడుతూ జిల్లా అటవీశాఖ అధికారి ఆవుల చంద్రశేఖర్ సూచనల మేరకు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు అటవీ ప్రాంతం నుంచి ఎర్రచందనం చెట్లు నరికి,నెల్లూరు జిల్లా రాపూరు మండలం తెగచెర్ల అటవీ ప్రాంతంలో డంప్ చేసి అక్కడ నుంచి కారు లో రవాణా చేసేందుకు సిద్ధంచేయగా అటవీశాఖ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు.





Total views : 81812