పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ యం శేఖర్ బాబు చేతుల మీదుగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ప్రత్తిపాడు,ఏలేశ్వరం,అన్నవరం, రౌతులపూడి ఎస్సైలతో పాటు పోలీస్ సిబ్బంది మరియు యువకులు సుమారు 80 మంది రక్తదానం చేసారు.. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ యం శేఖర్ బాబు మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సూచనల మేరకు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్ లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కాకినాడ రెడ్ క్రాస్ వారిచే ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరంలో పోలీస్ సిబ్బందితో పాటు యువత కూడా పాల్గొని రక్తదానం చేశారని తెలిపారు. యువత ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయటం అలవాటుగా మార్చుకోవాలని యువతకు ఈ సందర్భంగా సూచించారు.
Andhra Pradesh
పోలీసుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా అమర వీరుల త్యాగాలను స్మరించుకుంటూ జిల్లా పోలీస్ శాఖ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసింది. జిల్లాలోని పోలీసులతో పాటు వివిధ ప్రాంతాల్లో ప్రజలు, విద్యార్థులు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేశారు. అనంతరం రక్తదానం చేసిన పోలీసులకు ,విద్యార్థులకు, ప్రజలకు తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేశారు.
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలో పెద్దపులి సంచారిస్తున్నట్టు నిర్ధారణకు వచ్చారు ఫారెస్ట్ అధికారులు.. మండపల్లి పంచాయితీ అమ్మవారి పుట్టుక గ్రామ పొలాల్లో పెద్దపులి అడుగులను గుర్తించారు.. గ్రామాన్ని సందర్శించిన జిల్లా అటవీ శాఖ అధికారిని నిషా కుమారి.. పులి అడుగుజాడలను పరిశీలించి స్థానికులకు తగు సూచనలు చేసారు
తిరుమలలో అన్నప్రసాద విరాళం పై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి దర్శనార్థం దేశ విదేశాల నుంచి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు రుచిగా, శుచిగా ఒక రోజు అన్నప్రసాదాన్ని అందించే పథకానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. ఈ మేరకు టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు ఒకరోజు విరాళ పథకం ప్రారంభించింది. ఇందుకోసం ఒక రోజు పూర్తిగా అన్నప్రసాద వితరణ కోసం రూ.38 లక్షలు విరాళం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విరాళం మొత్తం గతంలో రూ.33 లక్షలు ఉండగా, ఆ మొత్తాన్ని టీటీడీ రూ.38 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.పెరిగిన ధరల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఇదే సమయంలో మరిన్ని కీలక నిర్ణయాలను ప్రకటించింది. ఉదయం అల్పాహారం కోసం రూ. 8 లక్షలు, మధ్యాహ్న భోజనం కోసం రూ.15 లక్షలు, రాత్రి భోజనం కోసం రూ.15 లక్షలు అందించి దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించవచ్చని టీటీడీ పేర్కొంది. విరాళం అందించే దాత పేరును వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ప్రదర్శిస్తారు. దాతలు తమ కోరిక మేరకు ఒకరోజు ఇక్కడ అన్నప్రసాదాలు వడ్డించే అవకాశాన్ని పొందొచ్చని టిటిడి ప్రకటించింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై టీడీపీ స్పష్టత ఇచ్చింది. పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించింది. పేరుకే పోటీ చేయడం కంటే దూరంగా ఉండడమే ఉత్తమమని ఆ పార్టీ నిర్ణయించుకుంది. ఈ మేరకు టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్కు అధినేత చంద్రబాబు సూచించినట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. స్కిల్ డెవల్పమెంట్ కేసులో చంద్రబాబు అరెస్టు, జైలులో ఉన్న పరిస్థితుల్లో తెలంగాణ ఎన్నికలపై దృష్టి సారించలేమని ఆ పార్టీ భావించింది. శనివారం రాజమండ్రి సెంట్రల్ జైలులో ములాఖత్ సందర్భంగా కాసానికి చంద్రబాబు సూచించారు. చంద్రబాబుతో కాసాని ములాఖత్లో దీనిపై నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్టు కాసాని కోరగాా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణపై దృష్టిసారించలేదని చంద్రబాబు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఏపీ ఎన్నికల్లో పోరాడి విజయం సాధిస్తే తెలంగాణలో కూడా పార్టీ సులభంగా బలపడుతుందని చంద్రబాబు సూచించారు. తెలంగాణ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకుంటే బాధపడాల్సి ఉంటుందని, ఇప్పటికైతే పోటీ కష్టమని అనిపిస్తోందని కాసాని జ్ఞానేశ్వర్కు సర్దిచెప్పినట్లు తెలిసింది. బరిలో దిగితే పూర్తి స్థాయిలో యుద్ధం చేయాలని, ప్రస్తుతం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో చూస్తున్నారు కదా అని సర్దిచెప్పినట్టు సమాచారం.
తిరుమల అక్టోబర్ 29న చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూత పడుతుంది. ఎనిమిది గంటలకు పైగా ఆలయం తలుపులు టిటిడి అధికారులు మూసి వేయనున్నారు. 29వ తేదీ తెల్లవారుజామున 1:05 నుండి 2:22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది. గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా 28న రాత్రి 7:05 గంటలకు టీటీడీ అధికారులు ఆలయం మూసివేస్తామన్నారు. తిరిగి గ్రహణం విడిచాకా అక్టోబరు 29 తెల్లవారుజామున 3:15 గంటలకు ఆలయాన్ని తెరవనున్నారు. చంద్రగ్రహణం కారణంగా 28న సహస్ర దీపాలంకార సేవ, వికలాంగులు మరియు వయోవృద్ధుల దర్శనం రద్దు చేశామన్నారు.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి లో నేడు చంద్రగ్రహణం సందర్భంగా అన్ని ఆలయాలు మూసివేసారు. కాని శ్రీకాళహస్తి ఆలయం మాత్రం నిత్యము జరిగే అభిషేక సేవలు, రాహు కేతు సర్ప దోష పూజలు యధావిధిగా కొనసాగుతున్నాయి. శ్రీకాళహస్తి ఆలయంలో గ్రహణ కాలము నందు స్వామి, అమ్మవార్లకు ప్రత్యేకముగా గ్రహణ కాలాభిషేకం జరుగుతుంది. ఈ గ్రహణ సమయంలో గ్రహణ కాలాభిషేకంలో పాల్గొనడానికి భక్తులు అధికసంఖ్యలో తరలి వస్తారు.
చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం నెల్లిపట్ల క్రాస్ వద్ద ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న కారును టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు . షిఫ్ట్ కారులో తరలిస్తున్న 13 దుంగలను స్వాధీనం చేసుకొని, ఒకరి అరెస్టు చేసారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నారు. పక్కా సమాచారంతో 30 లక్షల విలువ చేసే ఎర్రచందనం దుంగలను వెంటాడి పట్టుకున్నమని టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు.
అన్నపూర్ణగా వున్న ఆంధ్రా రాష్ట్రాన్ని అరాచక ఆంధ్ర గా మార్చారని, జగన్ ను వెంకటేశ్వర స్వామి తో పోల్చడం సరికాదన్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి. కొండపై రాజకీయాలు మాట్లాడటం వైసిపి నాయకులకు అలవాటుగా మారిందన్నారు. తిరుమలలో మార్గాని భరత్ మాటలను ఖండిస్తున్నామని.. ప్రజలకు మార్గాని భరత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబుపై కేసులకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయంటున్నారు.. మరి 50 రోజులుగా వాటిని బయటపెట్టకుండా ఏంచేస్తున్నారని వైసీపీ నేతలపై నారా లోకేశ్ తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయ ప్రత్యర్థులను ఎన్నికల్లో ఓడించేందుకు ప్రయత్నించడం సహజమేనని అయితే ప్రత్యర్థిని చంపాలని చూడడం వైసీపీ నేతలకే చెల్లిందని ఆరోపించారు. చంద్రబాబు జైలులోనే చనిపోతారంటూ వైసీపీ నేతలు చెబుతున్నారని లోకేశ్ గుర్తుచేశారు. కేసులతో ఎలాంటి సంబంధంలేని నా తల్లిని కూడా జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారని చెప్పారు. స్కాంలతో తమకు కానీ తమ పార్టీ నేతలకు కానీ బంధుమిత్రులకు కానీ ఎలాంటి సంబంధంలేదని లోకేశ్ స్పష్టం చేశారు. ఒకవేళ ఉందని మీ దగ్గర ఏ చిన్న ఆధారం ఉన్నా ప్రజల ముందు పెట్టాలని వైసీపీ నేతలకు లోకేశ్ బహిరంగ సవాల్ విసిరారు.




Total views : 202964