Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

Friday, May 1, 2026
Home Latest News ప్రజల కోసం ఎవరు కాళ్ళు మొక్కేందుకైనా సిద్ధం..

ప్రజల కోసం ఎవరు కాళ్ళు మొక్కేందుకైనా సిద్ధం..

by Rama

జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గంలోని ధరూర్ మండల కేంద్రం లో నిర్వహించిన మహిళా ఆశీర్వాద సభకు ధరూర్, కేటి దొడ్డి మండలాల నుండి మహిళలు భారీ ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా బూరెడ్డిపల్లి సర్పంచ్, ఎమ్మెల్యే భార్య బండ్ల జ్యోతి మాట్లాడుతూ కృష్ణమోహన్ రెడ్డిని చూసి కళ్ళు మండుతున్న వాళ్ళు విద్యార్థులపై కూడ అసత్య ఆరోపణలు చేస్తున్నారని రాజకీయాలలో విద్యార్థులను బలిపశువులు చేసి వారి జీవితాలతో ఆడుకోవద్దండి అని అన్నారు. గద్వాల విద్యార్థుల కోసం, గద్వాల ప్రజల కోసం కృష్ణమోహన్ రెడ్డి ఎవరు కాళ్ళు మొక్కేందుకైనా సిద్ధమని అన్నారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ అన్నం పెట్టే పార్టీ భారాస పార్టీ అని అన్ని చేసిన పార్టీ కావాల్న లేక మొండి చేయి పార్టీ కావాల్న అని ఎమ్మెల్యే అన్నారు. రెండు పర్యాయాలు ఓడిన ప్రజాబలం అండగా నిలిచింది, ఈరోజు ఈ స్థాయిలో ఉన్న అంటే కూడ మీరిచ్చే ధైర్యమని, ఎదగడానికి కారణమైన ప్రజలను గుండెల్లో పెట్టుకుని కాపాడుకునే భాద్యత నాదని అన్నారు. సీడ్ వ్యాపారం పెట్టి ప్రజల రక్తాన్ని పీల్చిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో వుంటూ దొంగల మాదిరి రాత్రి పూట వచ్చి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు ఏ మాత్రం పొరపాటు చేసిన గద్వాలలో చీకటి రోజులు వస్తాయి. 50 వేల మెజారిటీతో గెలుస్తున్నామని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు.

Advertisements

You may also like

Our Visitor

009337
Total views : 61684

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.