Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Andhra Pradesh నరసింహారావు కీలక వ్యాఖ్యలు..!

నరసింహారావు కీలక వ్యాఖ్యలు..!

by Satya
Narasimha Rao

ఏపీలో జనసేనతో తమ పార్టీ పొత్తుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు సమీపించే కొద్దీ రెండు పార్టీల మధ్య పొత్తుపై క్లారిటీ వస్తుందని తెలిపారు. ఇతర పార్టీలను కూడా కలుపుకు పోవాలా అనే దానిపై భవిష్యత్తులో చర్చిస్తామన్నారు. జనసేనతో పొత్తుపై మాకు ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేదు. 175 నియోజకవర్గాల్లో డిసెంబర్ నుంచి మా పార్టీ బలోపేతం అవడానికి పని చేస్తుంది. ఏపీ అధ్యక్షులు ఎవరైనా మా పార్టీ అభివృద్ధికే నిర్ణయాలు ఉంటాయి. తెలంగాణలో బీఆర్ఎస్‌ను ఓడించగల పార్టీగా బీజేపీ ఉంది. ఇండియా అలయెన్స్‌లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని చోట్లా పోటీ చేస్తోంది. అందరూ కలిసొచ్చినా, విడివిడిగా వచ్చినా, ఇంకో నలుగురిని తెచ్చుకున్నా మోదీదే గెలుపు. బీజేపీపై ఏ పార్టీ వ్యాఖ్యలు చేసినా వారిది అభద్రతా భావమే. కమ్యూనిస్టులు దిక్కు తోచక ప్రధాని మోదీపై అనేక ఏడుపుగొట్టు మాటలు మాట్లాడుతున్నారు. కమ్యూనిస్టులు దాదాపుగా కనుమరుగయ్యారు. తెలంగాణలో ఒకటో రెండో సీట్లు పొందారు. ఏపీలో కూడా సీట్ల కోసం కమ్యూనిస్టులు ఇలా మాట్లాడుతున్నారు’’ అని జీవీఎల్ ఎద్దేవా చేశారు.

Advertisements

You may also like

Our Visitor

039445
Total views : 196867

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: